గూగుల్పేను దాటిన ఫోన్ పే!
డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫాం గూగుల్ పే కన్నా వాల్మార్ట్కు చెందిన ఫోన్ పేను జనం ఎక్కువగా వినియోగించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. ఈ మేరకు డిసెంబరు నెల గణాంకాలను ఎన్పీసీఐ విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం డిసెంబర్ నెలలో ఫోన్పేలో 902.03 మిలియన్ల లావాదేవీలు
డిసెంబరు గణాంకాలను వెల్లడించిన ఎన్పీసీఐ
దిల్లీ: డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫాం గూగుల్ పే కన్నా వాల్మార్ట్కు చెందిన ఫోన్ పేను జనం ఎక్కువగా వినియోగించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. ఈ మేరకు డిసెంబరు నెల గణాంకాలను ఎన్పీసీఐ విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం డిసెంబర్ నెలలో ఫోన్పేలో 902.03 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ 1,82,126.88 కోట్లుగా ఉంది. అలాగే, 854.49 మిలియన్ల లావాదేవీలతో గూగుల్పే రెండో స్థానానికి చేరింది. దీనిలో జరిగిన డిజిటల్ చెల్లింపుల విలువ 1,76,199.33 కోట్లుగా ఉంది. డిసెంబరులో జరిగిన మొత్తం లావాదేవీల్లో ఈ రెండు యాప్లు 78శాతం వాటాను నమోదు చేసుకున్నాయి. నవంబరు నెలతో పోలిస్తే యూపీఐ పేమెంట్లలో ఫోన్పే 3.87శాతం పెరుగుదలను నమోదు చేయగా.. గూగుల్ పే 11శాతం లోటును నమోదు చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మూడో స్థానంలో ఉండగా, అమెజాన్ పే, ఎన్పీసీఐకు చెందిన బీహెచ్ఐఎం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
నవంబరు నుంచి డిజిటల్ చెల్లింపులను ప్రారంభించిన వాట్సాప్లో డిసెంబరులో 8లక్షలకు పైగా లావాదేవీలు జరగ్గా.. వీటి మొత్తం విలువ 29.72కోట్లుగా ఉంది. మొత్తంగా డిజిటల్ చెల్లింపులు డిసెంబరు నెలలో 1.08శాతం పెరిగాయని, ప్రస్తుతం 207 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. థర్డ్ పార్టీ యాప్ (టీపీఏ) ప్రొవైడర్లు అందిస్తున్న యూపీఐ లావాదేవీలపై నవంబర్లో ఎన్పీసీఐ 30 శాతం పరిమితిని ప్రకటించింది. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రభావం ఫోన్పే, గూగుల్ పేతో సహా ఇతర ప్లాట్ఫాంలపై ఎక్కువగా ఉండనుంది. అదేసమయంలో పేటీఎం, మొబిక్విక్లకు ఈ విధానం సహాయపడనుంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం