India@75: మరో 25ఏళ్లలో.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్
వచ్చే 25ఏళ్లలో మరిన్ని లక్ష్యాలను సాధించి.. శతాబ్ది ఉత్సవాల నాటికి (2047) అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ప్రధాని మోదీ ఉద్ఘాటన
దిల్లీ: స్వాతంత్ర్య వేడుకలు (Independence Day) జరుపుకొంటోన్న భారత్.. రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధించే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ముఖ్యంగా వచ్చే 25ఏళ్లలో మరిన్ని లక్ష్యాలను సాధించి.. శతాబ్ది ఉత్సవాల నాటికి (2047) అభివృద్ధి చెందిన దేశంగా (Developed Country) భారత్ అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం (Azadi Ka Amrit Mahotsav) సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. దాదాపు 83 నిమిషాల పాటు ప్రసంగించిన ఆయన.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మహానుభావులను స్మరించుకోవడంతో పాటు భారత లక్ష్యాలు, నారీశక్తి, అవినీతి, కుటుంబ రాజకీయాల వంటి అంశాలను ప్రస్తావించారు.
రానున్న రోజుల్లో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలపై మాట్లాడిన మోదీ.. ప్రతి ఒక్కరికి ఇల్లు, రైతుల ఆదాయం రెట్టింపుతోపాటు ఇతర సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు సాకారం చేసేందుకు ఐదు అంశాలపై ప్రధానంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం, బానిసత్వ నిర్మూలన, వారసత్వాన్ని పరిరక్షించడం, ఐకమత్యం, పౌరులు బాధ్యతలను నిర్వర్తించడం.. వంటివి ఐదు ప్రధాన లక్ష్యాలుగా (పంచ ప్రాణాలు) ప్రధాని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే 25ఏళ్లు మరింత చిత్తశుద్ధితో, లక్ష్యాలను చేరుకునేందుకు ముందుకు సాగాలని భారత ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కర్తగా ఇప్పటికే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న భారత్.. 130 కోట్ల మంది సంకల్పంతో 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
5జీ సేవలపై ప్రకటన..
ప్రస్తుతం ఉన్న 4జీ కన్నా అధిక వేగంతో డేటా అందించే 5జీ సేవల గురించి ప్రధాని మోదీ ప్రకటన చేశారు. త్వరలోనే దేశంలో 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. దీని కోసం ఎంతోకాలం వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ తీసుకెళ్తున్నామని చెప్పారు. గ్రామాల్లో 4 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయనీ.. దీనివల్ల 4 లక్షల డిజిటల్ ఆంత్రప్రెన్యూర్లో సిద్ధమవుతున్నారన్నారు.
అమృత కాలంలో పరిశోధనలకు పెద్దపీట వేయాల్సిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. దేశ యువతపై తనకా నమ్మకం ఉందని పేర్కొన్నారు. 5జీ, సెమీకండక్టర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు వంటివి ఆధునీకరణకు సంకేతం మాత్రమే కాదు.. అందులో మూడు పెద్ద శక్తులు ఇమిడి ఉన్నాయని మోదీ వివరించారు. డిజిటల్ యుగంలో విద్య, వైద్యం అన్నీ డిజిటల్ రూపు సంతరించుకోనున్నాయని చెప్పారు. సాంకేతికతతో ముడిపడి ఉన్న ఈ దశాబ్దాన్ని టెకేడ్గా మోదీ పేర్కొన్నారు.
ఇథనాల్ లక్ష్యం చేరుకున్నాం..
పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ను కలిపే లక్ష్యాన్ని అనుకున్నదానికంటే ముందుగానే భారత్ చేరుకుందని ప్రధాని మోదీ అన్నారు. 2022 నవంబర్ నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉండగా.. జూన్ నాటికే దాన్ని సాధించామన్నారు. 2025 నాటికి 20 శాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక్కడ అత్యల్ప ఓటింగ్.. మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ అత్యల్ప ఓటింగ్.. మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?