పీఎంవీవీవై స్కీమ్ లేదా ఎస్బీఐ వీకేర్ ఎఫ్డీలో ఏది మంచిది?

అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు మాత్రమే ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ పథకానికి అర్హులు......

Published : 24 Dec 2020 13:39 IST

అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు మాత్రమే ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ పథకానికి అర్హులు.

సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు, నెలవారీ పెన్షన్ పథకాలు రెండు అత్యంత ప్రాచుర్యం పొందిన పెట్టుబడి ఆప్షన్లు. ఈ నెల ప్రారంభంలో, భారతదేశపు అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు ఎస్బీఐ వీకేర్. దీనిని ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించడం జరిగింది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సవరించిన ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) అమ్మకాలను ప్రారంభించింది. సీనియర్ సిటిజన్ల కోసం 2017 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పెన్షన్ పథకం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఫిక్స్డ్ వడ్డీ రేటును ఆకర్షిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గుతున్న దృష్ట్యా, సీనియర్ సిటిజన్లకు పీఎంవీవీవై స్కీమ్ లేదా ఎస్బీఐ వీకేర్ ఎఫ్డీ లో ఏది మంచి పెట్టుబడి ఆప్షన్?

ఎస్బీఐ వీకేర్ ఎఫ్డీ పథకం :

అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు మాత్రమే ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ పథకానికి అర్హులు. ప్రస్తుతం, ఈ పధకానికి బ్యాంకు 6.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది, ఇది ప్రభుత్వ మద్దతుగల పెన్షన్ పథకం కంటే తక్కువ. ప్రత్యేక ఎఫ్‌డీ పథకం అదనపు పన్ను ప్రయోజనాలను కూడా అందించదు. ఎస్బీఐ వీకేర్ ఎఫ్‌డీ పథకంలో కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా 10 సంవత్సరాలు పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పథకం కింద ఎఫ్‌డీని ముందస్తుగా ఉపసంహరించుకోవాలని అనుకున్నట్లైతే, మీరు పెట్టిన పెట్టుబడి 5.8 శాతం వడ్డీ రేటును మాత్రమే పొందుతుంది. ఎస్‌బీఐ వీకేర్ ఎఫ్‌డీ పథకంలో పెట్టుబడులు పెట్టడానికి వినియోగదారులకు సెప్టెంబర్ 30 వరకు సమయం ఉంది.

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) పథకం :

60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) పథకం ప్రయోజనాలను పొందవచ్చు. దీనికి ఎలాంటి ప్రవేశ వయస్సు లేదు.

ఈ పెన్షన్ పథకానికి 10 సంవత్సరాల పాలసీ కాలపరిమితి ఉంది. పెన్షనర్ నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక పింఛను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) పై వచ్చే వడ్డీ రేటు, ఎస్బీఐ అందించే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం వడ్డీ రేటు కంటే ఎక్కువ. ఈ పథకం ఎఫ్‌వై 21 లో సంవత్సరానికి 7.40 శాతం రాబడిని ఇస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడులు పెట్టేవారికి, ఇది పదేళ్ల మొత్తం కాలపరిమితికి సంవత్సరానికి 7.40 శాతం వడ్డీని అందిస్తుంది.

ఒక వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పీఎంవీవీవై పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ పెన్షన్ పథకం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్ ద్వారా లభిస్తుంది.

సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఆధారంగా నెలకు కనీసం రూ. 1000 పెన్షన్ పొందవచ్చు. ఉపసంహరించుకోగల గరిష్ట పెన్షన్ మొత్తం నెలకు రూ. 9250 గా ఉంది.

ఈ పెన్షన్ పథకంలో ఒక వ్యక్తి రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 12,000 పెన్షన్ కోసం కనీస పెట్టుబడిని రూ. 1,56,658 గా, అలాగే నెలకు రూ. 1000 పొందటానికి కనీస పెట్టుబడి రూ. 1,62,162 లని ఎల్ఐసీ తెలిపింది.

పెట్టుబడిదారుడు లేదా వారి జీవిత భాగస్వామి టెర్మినల్ అనారోగ్యంతో లేదా క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లైతే, అలాంటి సందర్భంలో ముందస్తు సరెండర్ ను పీఎంవీవీవై అనుమతిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో, చెల్లించిన మొత్తంలో 98 శాతాన్ని పాలసీదారులకు తిరిగి చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని