Festive Sales: బిగ్ సేల్లో పాల్గొంటున్నారా? ముందే ఈ ప్రశ్నలు వేసుకోండి!
పండగ సీజన్ నేపథ్యంలో ఇ-కామర్స్ సంస్థలు అనేక రాయితీలను ప్రకటిస్తున్నాయి. మరి విచ్చలవిడిగా షాపింగ్ చేసి ఆర్థిక ఇబ్బందులకు గురి కావొద్దంటే.. ముందుగానే ఈ ప్రశ్నలను మీకు మీరు సంధించుకోండి...
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు అవసరమైతేనో లేక పండగలప్పుడో మాత్రమే షాపింగ్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఇ-కామర్స్ సంస్థలు ఎప్పుడు రాయితీలు, ప్రయోజనాలు ప్రకటిస్తే అప్పుడు కొనుగోలు చేయాలని నియమం పెట్టుకుంటున్నారు. ఫలితంగా అవసరం తీరడంతో పాటు కావాల్సిన వస్తువు తక్కువ ధరలో లభ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ పండగ సీజన్లో ఇ-కామర్స్ సంస్థలు ప్రకటించే ఆఫర్ల మోజులో పడి కొంతమంది విచ్చలవిడిగా ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నారు. తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సేల్లో పాల్గొనేముందు మనకు మనం కొన్ని ప్రశ్నలు సంధించుకుంటే సరిపోతుంది! అవేంటో చూద్దాం..
వస్తువు అవసరం నిజంగా ఉందా?
షాపింగ్ మోజులో పడి ఓ వస్తువును కొనుగోలు చేసేటప్పుడు దాని అవసరమెంతో కూడా వినియోగదారులు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఆఫర్ ఉంది కదా.. లేదా తక్కువ ధరలో దొరుకుతోంది కదా అని కొనేస్తున్నారు. రూ. వేలకు వేలు ఖర్చు చేసి కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా ఉపయోగించని వస్తువులను కొని ఉపయోగం ఏంటి? అందుకే ఏ చిన్న వస్తువు కొన్నా.. దాని అవసరం మీకెంత? దాంతో ఎంత ప్రయోజనం? ముందే పరిశీలించుకోండి. మీరు కొనే వస్తువు మీ అవసరం తీరుస్తుందనుకున్నా లేదా మీ సమయాన్ని ఆదా చేస్తుందనుకున్నా కొనుగోలు చేయండి. అదీ మీ ఆర్థిక పరిస్థితి సహకరిస్తేనే!
బడ్జెట్ ఎంత?
ఒకసారి ఇ-కామర్స్ సైట్లను తెరిచి ఆఫర్లను వెతకడం ప్రారంభిస్తే.. బోలెడన్ని ఆకర్షణీయ ప్రయోజనాలు, రాయితీలు కళ్ల ముందుంటాయి. వాటిని నిశితంగా పరిశీలించడంలో పడి వినియోగదారులు తమ బడ్జెట్ పరిమితుల్ని కూడా పట్టించుకోరు. అన్నింటినీ కార్ట్కు జత చేస్తూ పోతారు. చివరకు అన్నీ అవసరమే కదా.. కొనేస్తే పోలా అనుకుంటుంటారు. కానీ, ఈ తరహా పద్ధతిని అవలంబిస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మీరు ఫెస్టివల్ సేల్స్లో పాల్గొనాలనుకుంటే.. ముందే మీ బడ్జెట్ను నిర్ధారించుకోండి. దాని లోపలే కొనుగోలు చేయాలని నియమం పెట్టుకోండి.
అప్పు చేస్తున్నారా?
ఆఫర్లు ఉన్నాయి కదా అని అప్పు చేసి కొనడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే వస్తువు అవసరం, మీ బడ్జెట్ను నిర్ధారించుకున్నాక ఆ పరిమితులకు లోబడే కొనడం మంచిది. ఏదైనా చాలా ముఖ్యమైన లేదా ఎప్పటి నుంచో మీరు కొనాలనుకుంటున్న వస్తువుపై ఆకర్షణీయమైన రాయితీ ఉందనుకోండి! అలాంటప్పుడు అత్యవసరం కాని వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకోండి. ఆ డబ్బుల్ని ముఖ్యమైన వాటి కొనుగోలుకు వినియోగించుకోండి. అప్పటికీ కొనుగోలు తప్పదు.. బడ్జెట్ సహకరించడం లేదనుకుంటే.. క్రెడిట్ కార్డును ఉపయోగించుకోండి. బిల్లు పెద్ద మొత్తంలో ఉంటే దాన్ని ఈఎంఐ కిందకు మార్చుకోండి.
వాస్తవానికి మీరు ఇలాంటి పండగల సీజన్లో నిర్వహించే ప్రత్యేక సేల్స్లో పాల్గొనాలనుకున్నప్పుడు ముందు నుంచే పొదుపు చేసుకోవడం ప్రారంభించాలి. మీ నెలవారీ ఆదాయం నుంచి కొంతమొత్తాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఏదైనా ఖరీదైన వస్తువు కావాలంటే.. దానికి కావాల్సిన మొత్తాన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో ముందే నిర్ణయించుకోండి.
నిజంగా రాయితీ లభిస్తుందా?
ఇ-కామర్స్లో ఏదైనా వస్తువును కొనే ముందు దాని వాస్తవ ధరను క్షుణ్నంగా పరిశీలించాలి. రాయితీ ఎంత ఉందో చూసుకోవాలి. ఇతర సైట్లలో దాని ధర ఎంతో తెలుసుకోవాలి. అప్పుడే నిజంగా ఆ వస్తువుపై మీకు ఎంత ప్రయోజనం లభిస్తుందో తెలుస్తుంది. ఒక్కోసారి వినియోగదారులను ఆకర్షించడం కోసం సంస్థలు ధరను పెంచి దానిపై రాయితీ ప్రకటిస్తుంటాయి. వీలైతే మీరు కొనాలనుకుంటున్న వస్తువు ధరను కొన్ని నెలల ముందు నుంచే గమనిస్తూ ఉండాలి. ఎలా మారుతూ వస్తుందో చూసుకుంటే.. నిజంగా రాయితీ ఇస్తున్నారా.. లేదా.. ఇట్టే అర్థమైపోతుంది. కొన్ని వస్తువులపై రాయితీ పొందాలంటే షరతులు ఉంటాయి. వాటిని ముందే గమనించాలి. లేదంటే ప్రయోజనాన్ని పొందలేరు. తీరా ఆర్డర్ చేశాక చూస్తే రాయితీ వర్తించకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
వస్తువు కొత్తదేనా?
కొనాలన్న మోజులో పడి కొంతమంది ఆ వస్తువు పాతదా.. కొత్తదా గమనించరు. ఉదాహరణకు.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రోజురోజుకీ మరింత ఆధునికతను సంతరించుకుంటాయి. రెండు, మూడు సంవత్సరాల క్రితం విడుదలైన వస్తువులను ఇప్పుడు కొనడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. తక్కువ ధరకు లభించినప్పటికీ.. దాని ప్రయోజనాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. కాబట్టి, ఒక వస్తువును కొనేటప్పుడు దాంట్లో ఉన్న వివిధ వెర్షన్లను గమనించండి. మీరు కొనేది లేటెస్ట్ వెర్షన్ అవునో.. కాదో.. చూసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే