IPO: కొనసాగనున్న ఐపీఓల ట్రెండ్.. వచ్చేవారమూ మరో 4 పబ్లిక్ ఇష్యూలు
గతం వారం తరహాలోనే ఈ వారంలో నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. మొత్తం రూ.5,000 కోట్లు సమీకరించనున్నాయి.
దిల్లీ: గడిచిన వారం రోజుల్లో నాలుగు కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రాబోయే ఏడు రోజులు కూడా ఆ ట్రెండ్ కొనసాగనుంది. వచ్చే వారంలో మరో 4 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. దాదాపు రూ.5,000 కోట్లు సమీకరించనున్నాయి. ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్, కేన్స్ టెక్నాలజీ, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ ఈ జాబితాలో ఉన్నాయి.
☛ ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ ఐపీఓ నవంబరు 9న ప్రారంభమవనుంది. రూ.1,462 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూ నవంబరు 11న ముగుస్తుంది. ధరల శ్రేణిని రూ.386- 407గా నిర్ణయించారు. రూ.805 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 1.61 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద అందుబాటులో ఉండనున్నాయి. ఐపీఓలో సమీకరించిన నిధుల్ని గతంలో జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ రిడెమ్షన్కు ఉపయోగించనున్నారు.
☛ ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ధరల శ్రేణిని రూ.450-474గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ నవంబరు 9న ప్రారంభమై 11న ముగియనుంది. గరిష్ఠ ధర వద్ద రూ.1,960 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓలో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లు అందుబాటులో ఉన్నాయి.
☛ ఐఓటీ సొల్యూషన్ల ఆధారిత ఎలక్ట్రానిక్స్ సంస్థ కేన్స్ టెక్నాలజీ ఇండియా ఐపీఓ నవంబరు 10న ప్రారంభమై 14వ తేదీన ముగియనుంది. ఇష్యూ పరిమాణాన్ని కంపెనీ ఇటీవల రూ.650 కోట్ల నుంచి రూ.530 కోట్లకు తగ్గించింది. ధరల శ్రేణిని రూ.559- 587గా నిర్ణయించారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో కొంత భాగాన్ని రుణ చెల్లింపులకు వినియోగించనున్నారు. మరికొంత మొత్తంతో మైసూర్, మానేసర్లోని తయారీ కేంద్రాలకు మూలధనాన్ని సమకూర్చనున్నారు. కర్ణాటకలోని చామరాజ్నగర్లో కేన్స్ మరో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకూ ఈ నిధులను వెచ్చించనున్నారు. మిగిలిన మొత్తాన్ని ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు.
☛ ఐనాక్స్ విండ్ అనుబంధ సంస్థ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ నవంబరు 11న ప్రారంభమై 15న ముగియనుంది. రూ.740 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓలో రూ.340 కోట్ల విలువ చేసే తాజా షేర్లతో పాటు మరో రూ.370 కోట్ల విలువ చేసే షేర్లు ఆఫర్ సేల్ కింద అందుబాటులో ఉండనున్నాయి. ఐపీఓలో సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. విండ్ ఫార్మ్ ప్రాజెక్టులకు ఐనాక్స్ గ్రీన్ ‘ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్’ సేవలను అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?