Lending Rates: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణ రేట్లు పెంపు

పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండూ బ్యాంకులు ఎమ్‌సీఎల్‌ఆర్‌ను వివిధ కాలవ్యవధులకు పెంచాయి.

Updated : 01 Nov 2022 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవంబర్‌ 1 నుంచి మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్ల (ఎంసీఎల్‌ఆర్‌)ను పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెంచాయి. పీఎన్‌బీ 30 బేసిస్‌ పాయింట్ల వరకు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 15 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను 7.75% నుంచి 8.05%కు సవరించినట్లు తెలిపింది. అన్ని కాలవ్యవధుల ఎంసీఎల్‌ఆర్‌లు, ఓవర్‌నైట్‌ నుంచి 3 సంవత్సరాల వరకు ఒక్కొక్కటి 30 బేసిస్‌ పాయింట్లు..7.40% నుంచి 8.35%కు బ్యాంకు పెంచింది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక సంవత్సరపు ఎంసీఎల్‌ఆర్‌ 7.80% నుంచి 7.95%గా ఉంటుందని బ్యాంకు తెలిపింది. అన్ని కాలవ్యవధుల ఎమ్‌సీఎల్‌ఆర్‌లు 10 బేసిస్‌ పాయింట్లు (7.05% నుంచి 8.10%)కు పెంచింది. దీంతో ఈ 2 బ్యాంకుల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని