Term Insurance: ప్యూర్ టర్మ్, ప్రీమియం తిరిగివచ్చే టర్మ్పాలసీ ఏది తీసుకోవాలి?
టర్మ్ పాలసీ తక్కువ ప్రీమియం ఎక్కువ హామీ మొత్తాన్ని అందిస్తుంది.
పాలసీ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుల మనస్సులో వచ్చే సాధారణ ప్రశ్న.. జీవిత బీమా పాలసీ కొనుగోలు చేస్తే.. కాలపరిమితి పూర్తయ్యే సరికి ఎంత రాబడి వస్తుంది?’ సాధారణంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రొడెక్ట్లో పెట్టుబడి పెడితే రాబడి వస్తుంది. అయితే బీమాని పెట్టుబడిగా కాకుండా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించే సాధనంగా మాత్రమే చూడాలి. అలాంటిదే టర్మ్ బీమా.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆవ్యక్తి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు టర్మ్ బీమా ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే హామీ మొత్తం నామినీకి అందుతుంది. అయితే టర్మ్ బీమాలోనూ అనేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. - 1. ప్యూర్ టర్మ్ పాలసీ, 2. ప్రీమియం తిరిగే వచ్చే టర్మ్ పాలసీ(టీఆర్ఓపీ).
ప్యూర్ టర్మ్ బీమా..
ప్యూర్ టర్మ్ పాలసీ సాధారణ బీమా పథకం. బీమా సంస్థలు అందించే పలు ప్రణాళికల్లో దీనికి అధిక ప్రాముఖ్యత ఉంది. ఇందులో పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీకి మొత్తం హామీని చెల్లిస్తారు. దీనికి ఎలాంటి మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు. అంటే పాలసీ కాలపరిమితి పూర్తయ్యే సమయానికి పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించివుంటే ఈ పాలసీ కింద ఏ విధమైన ప్రయోజనాలు లభించవు. ఇతర పాలసీలతో పోలిస్తే ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది.
ఉదాహరణకి: కిషోర్కి 35 సంవత్సరాలు. అతను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, ధూమపానం అలవాటు లేదు. అతను 20 సంవత్సరాల కాలపరిమితితో రూ. 1 కోటికి ప్యూర్ టర్మ్ బీమా పథకాన్ని కొనుగోలు చేశాడు. ప్రీమియం రూ. 10,526. అతను పాలసీ తీసుకున్న 20 సంవత్సరాలలో దురదృష్టవశాత్తు మరణిస్తే, హమీ మొత్తం రూ.1 కోటి బీమా సంస్థ, నామినీకి అందిస్తుంది. కాలపరిమితి ముగిసే సమయానికి జీవించివుంటే ఎటువంటి చెల్లింపులు చేయరు.
ప్రీమియం తిరిగి వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్(టీఆర్ఓపీ)..
పాలసీ కాలపరిమితి పూర్తయ్యే నాటికి పాలసీ దారుడు జీవించి ఉంటే అతను చెల్లించిన ప్రీమియంల మొత్తాన్ని(పన్నులను మినహాయించి) పాలసీదారునికి తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ కాలపరిమితి పూర్తయ్యే నాటికి మరణిస్తే బీమా సంస్థ హామీ మొత్తం నామీనికి అందిస్తారు. ప్యూర్ టర్మ్ పాలసీతో పోలిస్తే, వీటి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణకి: రోహన్ అనే 35 సంవత్సరాల ధూమపానం అలవాటు లేని వ్యక్తి 20 సంవత్సరాల కాలపరిమితో రూ.1 కోటికి, ప్రీమియం తిరిగి వచ్చే టర్మ్ పాలసీని కొనుగోలు చేస్తే అతను చెల్లించవలసిన ప్రీమియం రూ. 39,036. ఒకవేళ రోహన్ పాలసీకాలపరిమితి పూర్తయ్యే వరకు జీవిస్తే అతను చెల్లించిన ప్రీమియంల మొత్తాన్ని తిరిగి పొందుతాడు. ఒకవేళ 20 సంవత్సరాల లోపు రోహన్ మరణిస్తే, హామీ మొత్తం రూ. 1 కోటిని బీమాసంస్థ నామినీకి చెల్లిస్తుంది.
ఏది తీసుకోవాలి?
ఈ రెండు పాలసీలలో దేని ప్రత్యేకత దానికి ఉంది. ఒక వ్యక్తి నిర్ధిష్ట అవసరాల ఆధారంగా పాలసీని ఎంచుకోవడం మంచిది. అయితే రెండింటిలోనూ చూస్తే, ప్యూర్ టర్మ్ పాలసీ ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు ఆర్ధిక నిపుణలు. ఒకవేళ మీరు ప్యూర్ టర్మ్ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ కుంటుంబానికి ఆర్థిక అండంగా ఉంటుంది కాబట్టి ముందుగా కుటుంబ అవసరాలకు అవసరమైన మొత్తాన్ని లెక్కించాలి. మీ కుటుంబ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది, మీరు భద్రత కల్పించాల్సిన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వారి జీవినశైలి, భవిష్యత్తు అవసరాలు, మొత్తం ఖర్చులు, అన్నింటిని సమగ్రంగా లెక్కిస్తే, ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలో తెలుస్తుంది.
వ్యక్తిగత రుణాలు, కారు, గృహ రుణాలు, వంటివి కూడా హామీ మొత్తంలో కవరయ్యేలా చూసుకోవాలి. అప్పుడు రుణాలకు చెల్లించాల్సిన ఈఎమ్ఐ భారం కుటుంబంపై పడకుండా జాగ్రత్త పడచ్చు. పిల్లల విద్య, భవిష్యత్తుకు ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. ప్యూర్ టర్మ్ పాలసీలతో పోలిస్తే, ప్రీమియం తిరిగి వచ్చే పాలసీలలో హామీ మొత్తం(300 నుంచి 400 రెట్లు) తక్కువ ఉంటుంది. అయినప్పటికీ ప్రీమియం తిరిగిరావాలని కోరుకునే వారు ఇవి తీసుకోవచ్చు.
చివరిగా..
కొన్నిసార్లు, మనం ఈ రోజు తీసుకునే అతి చిన్న నిర్ణయం రేపటి జీవితానికి పెద్ద భరోసాను అందిస్తుంది. ప్యూర్ టర్మ్ పాలసీ అనేది ప్రతీ ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండవలసిన జీవిత బీమా పథకం. ఇది బీమా కొనుగోలు చేసే వ్యక్తి అవసరాలు, జీవిత దశలపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల పాలసీల మేజిక్ నెంబర్లను చూసి మోసపోకుండా ఒక మంచి జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్