Radhika Merchant: అంబానీ కోడలు రాధిక హ్యాండ్ బ్యాగ్ ధర రూ.అర కోటి!
Radhika Merchant: అనంత్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్ (Radhika Merchant) జంట ఎన్ఎంఏసీసీ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ముంబయి: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ ‘నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో అనంత్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్ (Radhika Merchant) జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇటీవలే నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ జంట.. ఎన్ఎంఏసీసీ ప్రారంభోత్సవానికి నల్లని రంగు దుస్తుల్లో వచ్చారు. ఇండో వెస్ట్రన్ స్టైల్ లేస్ శారీలో వచ్చిన రాధిక (Radhika Merchant).. అనంత్ అంబానీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో రాధిక చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, అది చాలా ఖరీదైందని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. దీనిపై కొంత లోతుగా పరిశోధన చేసిన బాలీవుడ్షాదీస్.కామ్ అనే వెబ్సైట్ ఆ బ్యాగు విలువను వెల్లడించింది. అది దాదాపు రూ.52 లక్షలు ఖరీదు చేస్తుందని తెలిపింది. సిల్వర్ రంగులో ఉన్న ఈ హెర్మిస్ కెల్లీమోర్ఫోస్ బ్యాగ్లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్తో పాటు చైన్మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రాప్, క్లోచెట్తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉన్నాయి. ఈ బ్యాగ్కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ ఆ బ్యాగ్ ప్రత్యేకత..
ఫ్యాషన్ రంగంపై అవగాహన ఉన్నవారికి హెర్మిస్ బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ తమ డిజైనర్ బ్యాగ్లను కెల్లీగా నామకరణం చేసింది. దీనికి వెనక కూడా ఓ కథ ఉంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత నటి గ్రేస్ కెల్లీ ఈ బ్యాగును ఎప్పుడూ తన వెంట తీసుకెళ్లేవారు. ముఖ్యంగా ఆమె గర్భం దాల్చినప్పుడు.. దీన్ని అడ్డుగా పెట్టుకునేవారట. దాంతో ఈ బ్యాగ్లు చాలా పాపులర్ అయ్యాయి. అప్పటి నుంచి హెర్మిస్ వీటికి హెర్మిస్ కెల్లీ అని పేరు మార్చింది. తర్వాత ఈ బ్యాగ్లకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి హెర్మిస్ కెల్లీమోర్ఫోస్ పేరిట ఆభరణాలను కూడా విడుదల చేసింది. అందులోనూ ఈ బ్యాగ్ను కంటిన్యూ చేసింది. ఇది చూడ్డానికి బ్యాగ్లాగే కనిపిస్తున్నప్పటికీ.. నిజానికి ఇది ఒక ఆభరణాల సెట్ అని చెప్పాలి. దీంట్లోని ఒక్కో భాగం ఒక్కో ఆభరణం. ఈ బ్యాగ్కు ఉండే చిన్న చైన్లను చెవి పోగుల్లా ధరించొచ్చు. అలాగే బెల్ట్ను మెడ చుట్టూ ధరించే చోకర్లా పెట్టుకోవచ్చు.
‘ఎన్కోర్ హెల్త్కేర్’ సంస్థ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ కుమార్తె రాధిక (Radhika Merchant). ముకేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీకి కాబోయే భార్య. న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనమిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కొన్నాళ్లు పనిచేసింది. ప్రస్తుతం ఎన్కోర్ హెల్త్కేర్ బోర్డు డైరెక్టర్గా వ్యవహరిస్తోంది. జనవరిలో రాధిక, అనంత్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్