Radhika Merchant: అంబానీ కోడలు రాధిక హ్యాండ్ బ్యాగ్ ధర రూ.అర కోటి!
Radhika Merchant: అనంత్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్ (Radhika Merchant) జంట ఎన్ఎంఏసీసీ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ముంబయి: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ ‘నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో అనంత్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్ (Radhika Merchant) జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇటీవలే నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ జంట.. ఎన్ఎంఏసీసీ ప్రారంభోత్సవానికి నల్లని రంగు దుస్తుల్లో వచ్చారు. ఇండో వెస్ట్రన్ స్టైల్ లేస్ శారీలో వచ్చిన రాధిక (Radhika Merchant).. అనంత్ అంబానీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో రాధిక చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, అది చాలా ఖరీదైందని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. దీనిపై కొంత లోతుగా పరిశోధన చేసిన బాలీవుడ్షాదీస్.కామ్ అనే వెబ్సైట్ ఆ బ్యాగు విలువను వెల్లడించింది. అది దాదాపు రూ.52 లక్షలు ఖరీదు చేస్తుందని తెలిపింది. సిల్వర్ రంగులో ఉన్న ఈ హెర్మిస్ కెల్లీమోర్ఫోస్ బ్యాగ్లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్తో పాటు చైన్మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రాప్, క్లోచెట్తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉన్నాయి. ఈ బ్యాగ్కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ ఆ బ్యాగ్ ప్రత్యేకత..
ఫ్యాషన్ రంగంపై అవగాహన ఉన్నవారికి హెర్మిస్ బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ తమ డిజైనర్ బ్యాగ్లను కెల్లీగా నామకరణం చేసింది. దీనికి వెనక కూడా ఓ కథ ఉంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత నటి గ్రేస్ కెల్లీ ఈ బ్యాగును ఎప్పుడూ తన వెంట తీసుకెళ్లేవారు. ముఖ్యంగా ఆమె గర్భం దాల్చినప్పుడు.. దీన్ని అడ్డుగా పెట్టుకునేవారట. దాంతో ఈ బ్యాగ్లు చాలా పాపులర్ అయ్యాయి. అప్పటి నుంచి హెర్మిస్ వీటికి హెర్మిస్ కెల్లీ అని పేరు మార్చింది. తర్వాత ఈ బ్యాగ్లకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి హెర్మిస్ కెల్లీమోర్ఫోస్ పేరిట ఆభరణాలను కూడా విడుదల చేసింది. అందులోనూ ఈ బ్యాగ్ను కంటిన్యూ చేసింది. ఇది చూడ్డానికి బ్యాగ్లాగే కనిపిస్తున్నప్పటికీ.. నిజానికి ఇది ఒక ఆభరణాల సెట్ అని చెప్పాలి. దీంట్లోని ఒక్కో భాగం ఒక్కో ఆభరణం. ఈ బ్యాగ్కు ఉండే చిన్న చైన్లను చెవి పోగుల్లా ధరించొచ్చు. అలాగే బెల్ట్ను మెడ చుట్టూ ధరించే చోకర్లా పెట్టుకోవచ్చు.
‘ఎన్కోర్ హెల్త్కేర్’ సంస్థ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ కుమార్తె రాధిక (Radhika Merchant). ముకేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీకి కాబోయే భార్య. న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనమిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కొన్నాళ్లు పనిచేసింది. ప్రస్తుతం ఎన్కోర్ హెల్త్కేర్ బోర్డు డైరెక్టర్గా వ్యవహరిస్తోంది. జనవరిలో రాధిక, అనంత్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ