Rakesh Jhunjhunwala: ఝున్ఝున్వాలాను నిలబెట్టిన స్టాక్స్ ఇవే..
Rakesh Jhunjhunwala: ఝున్ఝున్వాలాకు బాగా లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీలు, ఆయన పెట్టుబడుల తీరు ఎలా సాగిందో.. ఓ సారి చూద్దాం..!
భారత్లో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలనుకునే ప్రతి ఔత్సాహిక మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలా (Rakesh Jhunjhunwala) గురించి తెలుసుకోకుండా ఉండరు. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆయనలా సంపాదించాలని కలలు కనకా మానరు. బహుశా.. ఈక్విటీల్లోకి ఎంటర్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ.. ఆయన వ్యూహాలు, పెట్టుబడుల తీరుపై కంప్యూటర్లలో వెతక్కుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఏయే కంపెనీల్లో మదుపు చేశారు? కొత్తగా ఆయన పోర్ట్ఫోలియోలో చేరిన కంపెనీలేవో నిరంతరం ట్రాక్ చేసే మదుపర్లు చాలా మందే ఉంటారు. అలాంటి వారందరికీ ఆయన హఠాన్మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ తరుణంలో ఆయనకు బాగా లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీలు, ఆయన పెట్టుబడుల తీరు ఎలా సాగిందో.. ఓ సారి చూద్దాం..!
ఇదీ చదవండి: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
రాకేశ్ ఝున్ఝన్వాలా (Rakesh Jhunjhunwala)కు ఓ స్టాక్ బోక్రింగ్ సంస్థ ఉంది. సతీమణి రేఖతో పాటు ఆయన పేరులోని ఆంగ్ల అక్షరాలను కలిపి ‘రేర్’ అని దానికి పేరు పెట్టారు. ఈ కంపెనీయే ఆయన పోర్ట్ఫోలియోలను కూడా నిర్వహిస్తుంటుంది. ‘ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్’ జాబితాలో ఆయన రూ.46.18 వేల కోట్లతో 438వ స్థానంలో ఉన్నారు. భారత్లో 36వ అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. దాదాపు 40 కంపెనీల షేర్లలో ఆయన మదుపు చేశారు.
- 1985లో సీఏ పూర్తి చేసిన ఆయన అదే సంవత్సరం మార్కెట్లో తొలిసారి మదుపు చేశారు. అప్పటికీ బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 150 వద్ద ఉంది. గత శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి అది 59,462.78 పాయింట్ల వద్ద స్థిరపడింది.
- మార్కెట్లోకి ప్రవేశించిన దాదాపు ఏడాది తర్వాత తొలిసారి ఆయన పెద్ద లాభాన్ని రుచి చూశారు. అప్పట్లో ‘టాటా టీ’ షేర్లను ఒక్కోటి రూ.43 వద్ద కొనుగోలు చేశారు. సరిగ్గా మూడు నెలల తర్వాత ఒక్కో షేరు రూ.143కు విక్రయించారు. అలా ఆయన 1986లో రూ.5 లక్షల లాభాన్ని ఆర్జించారు. దాదాపు మూడింతల రాబడిని పొందారు.
- ఝున్ఝున్వాలాకు బాగా కలిసొచ్చిన స్టాక్గా టైటన్ను చెబుతుంటారు. 2002-2003లో ఆయన ఒక్కో షేరును సగటున రూ.3 దగ్గర కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.2,140. టైటన్లో ఆయనకు దాదాపు 4.4 బిలియన్ల షేర్లు ఉన్నాయి. మార్చి 2022 నాటికి కంపెనీలో ఆయన వాటా 5 శాతం.
- రాకేశ్ 2006లో లుపిన్ షేర్లను ఒక్కోటి రూ.150 వద్ద కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ షేరు రూ.635 దగ్గర ట్రేడవుతోంది. వీటితో పాటు క్రిసిల్, ప్రజ్ ఇండ్, అరబిందో ఫార్మా, ఎన్సీసీ.. వంటి కంపెనీలు ఝున్ఝున్వాలాకు అనేక రెట్ల లాభాలిచ్చి ఆయన్ని బిగ్బుల్ని చేశాయి.
- ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్న మరికొన్ని కంపెనీలు- స్టార్ హెల్త్, ర్యాలీస్ ఇండియా, ఎస్కార్ట్స్, కెనరా బ్యాంక్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, అగ్రోటెక్ ఫుడ్స్, నజారా టెక్నాలజీస్, టాటా మోటార్స్. ఈ ఏడాది జూన్ త్రైమాసికం ముగిసే నాటికి ఆయనకు 47 కంపెనీల్లో వాటాలున్నాయి. టైటన్, స్టార్ హెల్త్, టాటా మోటార్స్, మెట్రో బ్రాండ్స్లో పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నాయి.
- కొన్ని ప్రముఖ కంపెనీల బోర్డుల్లో రాకేశ్ ఝున్ఝున్వాలా సభ్యుడిగా వ్యవహరించారు. పలు సినిమాలనూ నిర్మించారు. ‘ఇంగ్లిష్-వింగ్లిష్’, ‘శమితాబ్’, ‘కి అండ్ కా’ చిత్రాలను ఆయనే ప్రొడ్యూస్ చేశారు. హంగామా డిజిటల్ మీడియాకు ఛైర్మన్గానూ ఉన్నారు.
- తాజాగా నాల్కో, కెనరా బ్యాంక్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ను ఆయన తన పోర్ట్ఫోలియోకి జత చేసుకున్నారు. అంతకు ముందు సెయిల్లోనూ పెట్టుబడులు పెట్టారు.
- ఇటీవలే ఆయన ఆకాశ ఎయిర్ పేరిట విమానయాన రంగంలోకీ ప్రవేశించారు. 2022 ఆగస్టు 7న ప్రారంభమైన తొలి సర్వీసులో ఆయన ముంబయి నుంచి అహ్మదాబాద్కు ప్రయాణించారు. ఈ కంపెనీలో ఝున్ఝున్వాలాకు 40 శాతం వాటా ఉంది.
- రూ.5,000తో పెట్టుబడి ప్రారంభించి.. రూ.40 వేల కోట్లు గడించిన ఝున్ఝున్వాలా లెక్కలు తప్పిన సందర్భాలూ ఉన్నాయి. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ అలాంటి వాటిలో ఒకటి. అత్యంత నమ్మకంతో ఈ కంపెనీలో ఆయన ఒక్కో షేరును రూ.135 వద్ద 25 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. కానీ, ఆయన అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఆ కంపెనీ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని కుప్పకూలింది.
- సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్కు రిటైలర్గా వ్యవహరించిన ‘మంధన రిటైల్’ విషయంలోనూ రాకేశ్ అంచనాలు తప్పాయి. 2016లో ఒక్కో షేరు రూ.247 వద్ద కొనుగోలు చేశారు. చివరకు 2021 డిసెంబరులో ఒక్కో షేరు ధర రూ.16 వద్ద ఉన్నప్పుడు నిష్క్రమించారు. ఆయనకు నష్టాలను మిగిల్చిన కంపెనీల జాబితాలో మరో ప్రముఖ సంస్థ డీబీ రియాలిటీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు