Ratan Tata: ఒంటరితనం ఎలా ఉంటుందంటే.. రతన్ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు
అంకురాల్లో పెట్టుబడి పెట్టి, కొత్త ఆలోచనలకు అండగా నిలుస్తుంటారు టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా.
‘గుడ్ఫెల్లోస్’ స్టార్టప్లో పెట్టుబడులు పెట్టిన టాటా
ముంబయి: అంకురాల్లో పెట్టుబడి పెట్టి.. కొత్త ఆలోచనలకు అండగా నిలుస్తుంటారు టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా. తాజాగా ఆయన ‘గుడ్ఫెల్లోస్’ అనే అంకుర సంస్థలో పెట్టుబడిపెట్టారు. పిల్లలకు దూరంగా ఉన్న వయసు మళ్లిన వృద్ధులకు ఆసరాను అందించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. దీనిని శంతను నాయుడు ప్రారంభించారు.
న్యూయార్క్లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి శంతను గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్గా ఉంటున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. 80ల్లో ఉన్న టాటాకు.. ఈ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరిని కలిపింది వీధి శునకాలపై ఉన్న ప్రేమే. ఇలా పెద్ద వయసు వ్యక్తులతో స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు, వృద్ధుల పట్ల ఉన్న ఆప్యాయత ఈ ‘గుడ్ఫెల్లోస్’ను ప్రారంభించడానికి దోహదం చేశాయని ఇదివరకు శంతను వెల్లడించారు.
‘గుడ్ ఫెల్లోస్’ లాంచింగ్ కార్యక్రమంలో రతన్ టాటా మాట్లాడుతూ.. ‘ఒక తోడుంటే బాగుండు అని కోరుకుంటూ ఒంటరిగా సమయం గడిపేవరకూ.. ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. అలాగే వాస్తవంగా వయసు మళ్లే వరకు.. వృద్ధాప్యం గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరన్నారు. ప్రస్తుతం సహజ సత్సాంగత్యాన్ని పొందడం అత్యంత సవాలుగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా శంతను ఆలోచనావిధానాన్ని మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా శంతను మాట్లాడుతూ.. 50 మిలియన్ల మంది వృద్ధులు స్వతహాగా జీవిస్తున్నారని, వారితో జీవితాన్ని పంచుకునే వ్యక్తులు లేకుండా ఉన్నారని తెలిపారు. ఈ స్టార్టప్ కింద.. సానుభూతితో వ్యవహరించేవారిని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగిన వారిని నియమించుకుంటారు. వారు వృద్ధులకు సహచరుల్లా వ్యవహరిస్తూ, ప్రతి పనిలో ఆసరాగా నిలుస్తారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ సేవలు ముంబయిలోని 20 మంది వృద్ధులకే అందుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంస్థను పుణె, చెన్నై, బెంగళూరుకు విస్తరించాలన్నది ప్రణాళిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా