Ratan Tata: డియర్‌ ప్యాసింజర్స్‌.. రతన్‌ టాటా స్పెషల్‌ వెల్‌కమ్‌.. వినండి!

దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి పుట్టినింటికి చేరుకుంది. గతవారం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను అధికారికంగా టాటా గ్రూప్‌నకు

Updated : 02 Feb 2022 12:22 IST

ఎయిరిండియా ప్రయాణికులకు టాటా ప్రత్యేక సందేశం

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి పుట్టినింటికి చేరుకుంది. గతవారం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను అధికారికంగా టాటా గ్రూప్‌నకు అప్పగించింది. ఈ సంస్థ టాటా గ్రూప్‌నకు బదిలీ అయిన తర్వాత టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌, టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా తొలిసారిగా స్పందించారు. ఎయిరిండియా ప్రయాణికులకు సాదర స్వాగతమంటూ ప్రత్యేక ఆడియో మెసేజ్‌ పంపారు.

‘‘ఎయిరిండియా నూతన ప్రయాణికులకు టాటా గ్రూప్‌ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. ప్రయాణికుల సౌకర్యం, సేవల పరంగా విమానయానం అంటే ఎయిరిండియానే అనేలా సంస్థను తీర్చిదిద్దేలా పని చేసేందుకు సంతోషంగా ఉన్నాం’’ అని టాటా ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రత్యేక ఆడియో సందేశాన్ని ఎయిరిండియా ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించింది. ఈ బిడ్డింగ్‌లో టాటా సన్స్‌ అనుబంధ కంపెనీ అయిన టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విజేతగా నిలిచినట్లు గతేడాది అక్టోబరులో కేంద్రం ప్రకటించింది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత జనవరి 27న ఎయిరిండియాను అధికారికంగా టాటా గ్రూప్‌ చేతుల్లో పెట్టారు. ఎయిరిండియాకు చెందిన 100 శాతం షేర్లను టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన టాలెస్‌ ప్రై.లి.కు బదిలీ చేయడంతో పాటు, యాజమాన్య నియంత్రణ కూడా అప్పగించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని