Shaktikanta Das: సిలికాన్ బ్యాంక్ దివాలా.. భారత్ బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ
ఆస్తులకు, అప్పులకు మధ్య సమతుల్యత లోపించినప్పుడు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంతదాస్ (Shaktikanta Das) భారత్ బ్యాంకులను హెచ్చరించారు. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభమే దీనికి ఉదాహరణ అని చెప్పారు.
దిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా రెండు బ్యాంకులు దివాలా తీసిన నేపథ్యంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరికలు చేశారు. ఆస్తులకు, అప్పులకు మధ్య సమతుల్యత లోపిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఆర్థిక సమతుల్యతకు ఈ రెండూ ప్రమాదమేనన్న ఆయన.. ప్రస్తుతం అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో కొనసాగుతున్న సంక్షోభం అలాంటిదేనని చెప్పారు. కోచిలో ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంక్ ఫౌండర్ కేపీ హోర్మిస్ స్మారకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దేశీయ ఆర్థిక రంగం స్థిరంగా ఉందని, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. మారకపు రేట్లలో కొనసాగుతున్న అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ పెరిగినప్పటికీ.. దాని ప్రభావం భారత్పై పెద్దగా ఉండబోదని శక్తికాంత దాస్ వెల్లడించారు. భారత్ విదేశీ రుణాలన్నీ నిర్వహించదగ్గవేనని చెప్పారు.
పరిమితికి మించి డిపాజిట్లు స్వీకరించడం వల్లే అమెరికాలోని ఓ బ్యాంక్ సంక్షోభంలో పడిందని శక్తికాంతదాస్ పరోక్షంగా ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీ అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పేందుకు అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభమే ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఎప్పటి నుంచో క్రిప్టోని ఆయన వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ తన ప్రసంగంలో జీ 20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించడాన్ని ఎక్కువగా ప్రస్తావించారు. అమెరికా డాలర్ విలువ పెరుగుదల వల్ల విదేశీ రుణాలతో సమస్య ఎదుర్కొనే దేశాలకు సాయం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద కూటమి జీ20 ముందుకురావాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులతో సతమతమవుతున్న దేశాలకు యుద్ధప్రాతిపదికన ఆర్థిక సాయం చేయాలని ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా