RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
RBI imposes penalty on 3 banks: ఎస్బీఐ సహా మూడు ప్రభుత్వరంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
ముంబయి: నిబంధనలు పాటించడంలో విఫలమైన కారణంగా మూడు ప్రభుత్వరంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొరడా ఝుళిపించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) పాటు ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కు భారీగా పెనాల్టీ వడ్డించింది. రుణాలు, అడ్వాన్సులు- చట్టబద్ధ ఇతర పరిమితులు; ఇంట్రా గ్రూప్ లావాదేవీలు, రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైన కారణంగా ఎస్బీఐకి రూ.1.30 కోట్లు జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
రుణాలు- అడ్వాన్సులతో పాటు, కేవైసీ, 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (డిపాజిట్లపై వడ్డీ రేట్లు) మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైనందుకు ఇండియన్ బ్యాంక్కు రూ.1.62 కోట్లు జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్ విషయంలో కొన్ని నిబంధనలు పాటించనందుకకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కూ రూ.1 కోటి పెనాల్టీ వేసింది. ఎన్బీఎఫ్సీకి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉల్లంఘించడంలో విఫలమైన కారణంగా ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు రూ.8.80 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినందుకే బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలకు జరిమానా విధించామని, వినియోగదారుల సేవలకు వీటితో ఎలాంటి సంబంధం లేదని ఆర్బీఐ పేర్కొంది.
అదే జరిగితే.. భారత్లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే
సహకార బ్యాంక్ లైసెన్స్ రద్దు
ముంబయి వేదికగా నడుస్తున్న ది కపోల్ కోపరేటివ్ బ్యాంక్ లైసెన్సును ఆర్బీఐ రద్దు చేసింది. తగినంత మూలధనం, ఆదాయానికి అవకాశాలు క్షీణించడంతో పాటు డిపాజిటర్లకు సొమ్ము చెల్లించలేని స్థితికి బ్యాంక్ చేరడంతో లైసెన్సును రద్దు చేసినట్లు తెలిపింది. ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆదేశించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్యాంకు డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్ మొత్తం అందుకుంటారని, 96.09 శాతం మందికి పూర్తి డిపాజిట్లు అందుతాయని ఆర్బీఐ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
హోండా కంపెనీ తన సీబీ350, సీబీ 350 ఆర్ఎస్ మోడల్ బైకులను రీకాల్ చేసింది. ఒక పార్ట్లో లోపాన్ని గుర్తించామని, దాన్ని రీప్లేస్ చేసి ఇస్తామని కంపెనీ పేర్కొంది. -
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్
Google: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? -
రామలింగ రాజు, మరో నలుగురు రూ.624 కోట్లు లాభపడ్డారు
దాదాపు 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. -
జోష్
దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది -
వాహన అమ్మకాలకు పండగ హుషారు
ఈ ఏడాది నవంబరులో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరా రికార్డు స్థాయిలో జరిగింది. పండగ సీజను గిరాకీకి తగ్గట్లుగా డీలర్లకు కంపెనీలు భారీగా వాహనాలను అందించాయి -
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15 శాతం అధికం. ‘2023 నవంబరులో స్థూలంగా రూ.1,67,929 కోట్ల జీఎస్టీ వసూలైంది. -
భారత ఆర్థిక భవితపై సీఎఫ్ఓలు ఆశావహం
దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94 శాతం భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్ఓ) విశ్వాసం వ్యక్తం చేశారని డెలాయిట్ ఇండియా పేర్కొంది. ఆసియా పసిఫిక్ (అపాక్) ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావహ శాతమని వెల్లడించింది. -
న్యాయ సలహాదారును నియమించుకోనున్న రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లు
రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గౌతమ్ సింఘానియా విడాకుల వివాదం వల్ల ఏర్పడ్డ పరిస్థితులను పరిశీలిస్తున్నామని ఆ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు పేర్కొన్నారు. కంపెనీ వ్యవహారాలు, వ్యాపారంపై ప్రభావం పడకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం. -
రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే
చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది -
డీప్ఫేక్ వీడియోలపై ఆసక్తి లేదు
డీప్ఫేక్ వీడియోలపై యూట్యూబ్కు ఎంతమాత్రం ఆసక్తి లేదని ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంతో అనుబంధం ఉండాలని మా భాగస్వాములెవరూ భావించడం లేదనీ తెలిపారు. -
ఒక కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వం
ఒక రంగంలోని సంస్థలన్నింటికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ, ఒక విభాగంలోని ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎటువంటి రాయితీలను ఇవ్వదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు -
రూ.22 పెరిగిన వాణిజ్య సిలిండర్
హోటళ్లు, రెస్టారెంట్ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. ఈ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.2002 నుంచి రూ.22 పెరిగి రూ.2024 అయ్యింది. -
సంక్షిప్త వార్తలు(6)
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎమ్ఎస్ఐ) తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైక్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల
-
KRMB: సాగర్ ఘటన.. ముగిసిన జలశక్తి శాఖ కీలక సమావేశం