Unclaimed deposits: బ్యాంకుల వద్ద అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎన్నో తెలుసా?
Unclaimed deposits: దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు (Unclaimed deposits) పెరుగుతున్నాయి. గతేడాది ₹39,264 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹48,264 కోట్లకు చేరింది.
ముంబయి: దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు (Unclaimed deposits) పెరుగుతున్నాయి. గతేడాది ₹39,264 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹48,264 కోట్లకు చేరింది. వార్షిక నివేదికలో ఈ విషయాన్ని ఆర్బీఐ (RBI) ఇటీవల వెల్లడించింది. ఈ క్రమంలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్ మొత్తాలను క్లెయిమ్ చేసుకోవాలని సూచిస్తూ ఆర్బీఐ జాతీయ స్థాయిలో క్యాంపెయిన్ నిర్వహించనుంది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 8 రాష్ట్రాల్లో అధికంగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బిహార్, తెలంగాణ/ఏపీ ఈ జాబితాలో ఉన్నాయి. క్యాంపెయిన్లో భాగంగా ఈ 8 రాష్ట్రాల్లో స్థానిక భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్లో సైతం ఆర్బీఐ ప్రచారం నిర్వహించనుంది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. సేవింగ్స్/ కరెంట్ అకౌంట్లో ఉండే మొత్తాలను 10 ఏళ్ల పాటు నిర్వహించకపోతే దాన్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పేర్కొంటారు. మెచ్యూరిటీ పూర్తయ్యి 10 ఏళ్లు అయినా టర్మ్ డిపాజిట్ మొత్తాలు క్లెయిమ్ చేయకపోతే వాటినీ అన్క్లెయిమ్డ్గానే పరిగణిస్తారు. ఈ మొత్తాన్ని ఆర్బీఐ నిర్వహించే ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు తరలిస్తారు.
సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు క్లోజ్ చేయకపోవడం, ఖాతాలను నిర్వహించలేకపోవడం, డిపాజిటర్ ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో అతడి వారసులు గానీ, చట్టబద్ధ వారసులుగానీ ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయని కారణంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ మొత్తాలు పెరిగిపోతున్నట్లు ఆర్బీఐ విశ్లేషించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా గుర్తించినప్పటికీ డిపాజిటర్లు గానీ, అతడి వారసులు/ చట్టబద్ధ వారసులు ఆ మొత్తాన్ని వడ్డీతో సహా పొందే వీలుంది. ఈ ఉద్దేశంతోనే క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!