Interest Rates: ఈసారి వడ్డీరేట్లు ఎంత పెరగొచ్చు? నిపుణుల అంచనాలిలా ఉన్నాయ్..
భారతీయ రిజర్వు బ్యాంకు ఈసారి పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు 35 బేసిస్ పాయింట్ల వరకు పెంపు ఉండొచ్చని అంచనా వేశారు....
ముంబయి: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు ఇటీవల వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో ఆ ప్రభావం భారతదేశ ద్రవ్య విధానంపై ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు ఈసారి పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు 35 బేసిస్ పాయింట్ల వరకు పెంపు ఉండొచ్చని అంచనా వేశారు.
దేశ ద్రవ్య పరపతి విధానంలో క్రమంగా సర్దుబాటు వైఖరి వీడనున్నామని గత సమీక్షలోనే ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఈ నెల 3 నుంచి ప్రారంభం కానుంది. గత ఆరు నెలలుగా రిటైల్ ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ ఆర్బీఐ లక్ష్యిత పరిధి అయిన 6 శాతానికి ఎగువనే నమోదువుతున్న విషయం తెలిసిందే. దీంతో వడ్డీరేట్లను క్రమంగా పెంచాలని నిర్ణయించింది. మే నెలలో 40 పాయింట్లు, జూన్ మరో 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో ప్రస్తుతం రెపోరేటు 4.9 శాతానికి చేరింది. కరోనా సంక్షోభానికి ముందు ఉన్న 5.15 శాతంతో పోలిస్తే ఇది ఇంకా తక్కువే.
- ఈ వారంలో జరిగే సమీక్షలో రెపోరేటును కరోనా మునుపటి స్థాయికి తీసుకెళ్లాలని ఆర్బీఐ కమిటీ నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. తర్వాతి నెలల్లో దాన్ని మరింత పెంచే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో కీలక వడ్డీరేట్లను 35 బేసిస్ పాయింట్లు పెంచొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. అయితే, మరింత కఠినంగా వ్యవహరించాలని ఆర్బీఐ భావిస్తే 50 బేసిస్ పాయింట్ల పెంపునూ కొట్టిపారేయలేమన్నారు. ధరలు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కాస్త మెతకగా ఉండొచ్చనుకుంటే 25 పాయింట్ల పెంపునకే పరిమితం అయ్యే అవకాశం ఉందన్నారు.
- ఫెడరల్ రిజర్వు 2022లో వడ్డీరేట్లను 225 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. ఆర్బీఐ 90 పాయింట్లతో సరిపెట్టుకొంది. అమెరికా సెంట్రల్ బ్యాంకు అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రభావం ఆర్బీఐపైనా ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తెలిపింది. అయితే, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.. రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ అంత దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఏదైనా ఉత్పాతం జరిగితే తప్ప.. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఫలితంగా ఆగస్టులో 25 బేసిస్ పాయింట్లు.. తర్వాతి రెండు సమీక్షల్లో మరో 25 పాయింట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రభుత్వ సూచనల మేరకు ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యిత పరిధిని 2%-6%గా నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి ఇది 6 శాతం ఎగువనే ఉంటోంది. జూన్లో 7.01 శాతంగా నమోదైంది.
- రేట్ల పెంపు విషయంలో ఫెడ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర కేంద్ర బ్యాంకులు వ్యవహరిస్తున్నంత కఠినంగా ఆర్బీఐ తమ విధానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాత్ తెలిపారు. తమ అంచనా ప్రకారం రేపో పెంపు 20-25 పాయింట్ల మధ్య ఉండొచ్చన్నారు.
- వచ్చే రెండు త్రైమాసికాల పాటు ఆర్బీఐ దృష్టి ధరల స్థిరీకరణపైనే ఉంటుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఆర్థికవేత్త రాధికా రావు తెలిపారు. జులై-సెప్టెంబరులోనూ ద్రవ్యోల్బణం అధికంగా ఉంటుందని పరిగణనలోకి తీసుకొని రేట్ల పెంపు 35 బేసిస్ పాయింట్లు ఉండొచ్చని తెలిపారు. తర్వాత వరుసగా మూడుసార్లు మరో 25 పాయింట్ల చొప్పున పెంచి 6 శాతం వద్ద స్థిరీకరించే అవకాశం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఏ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్