
RBI Rate Hike: ‘వడ్డీరేట్లు పెంచడంలో ఆర్బీఐ ఆలస్యం చేయలేదు’
ఎంపీసీ సభ్యురాలు ఆశిమా గోయల్
దిల్లీ: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకుగానూ వడ్డీరేట్లను పెంచడంలో ఆర్బీఐ ఏమాత్రం ఆలస్యం చేయలేదని ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) సభ్యురాలు ఆశిమా గోయల్ తెలిపారు. కరోనా వైరస్ సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థలో వచ్చే కుదుపులకు అతిగా స్పందించడం కూడా అంతమంచిది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన ఆహార, చమురు ధరల పెరుగుదలతో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. దీనివల్లే ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత పరిధిని దాటిందని పేర్కొన్నారు. కానీ, దేశంలో గిరాకీ, వేతనాలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజాన్ని దృష్టిలో ఉంచుకునే రేట్ల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. లేదంటే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతూకం దెబ్బతింటుందని పేర్కొన్నారు.
ఎంపీసీ పరిగణనలోకి తీసుకునే ద్రవ్యోల్బణ అంచనాలు ప్రస్తుతానికి ఆర్బీఐ లక్షిత పరిధిలోనే ఉన్నాయని గోయల్ తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదని పేర్కొన్నారు. పైగా కరోనా మరోసారి విజృంభించే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపారు. ఈ తరుణంలో వడ్డీరేట్ల పెంపు విషయంలో అతిగా స్పందించడం కూడా అంతమంచిది కాదని వివరించారు.
ఇటీవల అత్యవసరంగా భేటీ అయిన ఆర్బీఐ రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరి 7.79 శాతంగా నమోదైంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సైతం వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
TSRTC: శ్రీవారి భక్తులకు శుభవార్త
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే
- Andhra News: కాటేసిన కరెంటు
- Income Tax Rules: రేపటి నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..