IPO: ఐపీఓలో షేర్లు అలాట్ కావడం లేదా? కారణం ఇదేనేమో..!
ఐపీఓకి బిడ్లు దాఖలు చేసే ముందు ఆ కంపెనీ పూర్తి వివరాలు ముందే తెలుసుకోవాలి. దరఖాస్తులో ఎలాంటి తప్పులు లేకుండా చేసుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో ఐపీఓలకు ఆదరణ పెరుగుతోంది. స్టాక్ మార్కెట్పై అవగాహన పెరుగుతున్న కొద్దీ పబ్లిక్ ఇష్యూల్లో చిన్న మదుపర్ల భాగస్వామ్యం ఎక్కువవుతోంది. చాలా మంది ఐపీఓలో పాల్గొనేందుకే డీమ్యాట్ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే, ఐపీఓలో బిడ్లు దాఖలు చేసిన ప్రతిఒక్కరికీ షేర్లను కేటాయించరు. ఇది చాలామందిలో నిరాశను మిగులుస్తుంది. ప్రతిసారీ ఇలాగే జరుగుతున్నట్లయితే.. కచ్చితంగా దానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సిందే.
ఐపీఓలో ఎందుకు మదుపు చేస్తారు?
కంపెనీతో సంబంధం లేనివారి నుంచి నిధులు సమీకరించేందుకే సంస్థలకున్న మార్గాల్లో ఐపీఓ ఒకటి. దీంట్లో సామాన్య మదుపర్ల నుంచి సంస్థాగత పెట్టుబడిదారుల వరకు ఎవరైనా పాల్గొనవచ్చు. దీంతో అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న కంపెనీ పబ్లిక్ లిస్టెడ్ సంస్థగా మారుతంది. వ్యాపార విస్తరణ, కార్యకలాపాల నిర్వహణకు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వినియోగిస్తుంటారు. అందుకే అభివృద్ధి చెందుతున్న కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఐపీఓ ఓ మార్గం.
షేర్లు కేటాయించకపోవడానికి కారణాలు..
ఓవర్ సబ్స్క్రిప్షన్...
ఓ కంపెనీ ఐపీఓకి వస్తే షేర్ల ధర, ఎన్ని షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు? వంటి వివరాలను వెల్లడిస్తాయి. అర్హతగల సంస్థాగత మదుపర్లు, సంస్థాగతేతర మదుపర్లు, చిన్న మదుపర్లు.. ఇలా మూడు కేటగిరీలకు వేర్వేరుగా షేర్లు కేటాయిస్తారు. ఒక్కో వర్గానికి కొంత మొత్తం షేర్లు రిజర్వు చేసి పెడతారు. అందుకే ఒక్కో కేటగిరీకి ఉన్న షేర్ల కంటే ఎక్కువవాటికి దరఖాస్తులు వస్తే.. అప్పుడు దాన్ని ఓవర్సబ్స్క్రిప్షన్ అంటారు.
అలాంటప్పుడు కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్ ద్వారా షేర్లను కేటాయిస్తారు. అందుబాటులో ఉన్న షేర్ల కంటే అధిక షేర్లకు బిడ్లు అందినందున.. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ షేర్లను కేటాయించడం కుదరదు.
దరఖాస్తులో తప్పులు..
వచ్చిన ప్రతి దరఖాస్తు పత్రాన్ని రిజిస్ట్రార్ క్షుణ్నంగా పరిశీలిస్తారు. అసంపూర్ణంగా ఉన్నా.. ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినా దరఖాస్తును తిరస్కరించారు.
తక్కువ బిడ్ ధర..
ఐపీఓ ధరల శ్రేణి కంటే తక్కువకు బిడ్ చేసినట్లయితే షేర్లను కేటాయించరు. అలాగే ఎక్కువ మంది పేర్కొన్న గరిష్ఠ ధరనే షేర్ల అలాట్కు ఆధారంగా తీసుకుంటారు. దాని కంటే తక్కువ ధరను కోట్ చేసినవారికి షేర్లను కేటాయించరు. సాధారణంగా చాలా మంది ఐపీఓ గరిష్ఠ ధర వద్దే బిడ్లను దాఖలు చేస్తుంటారు.
షేర్ల కేటాయింపు అవకాశాన్ని మెరుగుపర్చుకోండిలా..
దరఖాస్తు సరిగ్గా: బిడ్లు దాఖలు చేసే సమయంలోనే దరఖాస్తు ఫారాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి.
పెద్ద దరఖాస్తులు వద్దు: చాలా మంది ఎక్కువ మొత్తం షేర్లకు బిడ్లు దాఖలు చేయడం వల్ల అలాట్కు అవకాశం మెరుగవుతుందని భావిస్తారు. కానీ, అది నిజం కాదు. అన్ని దరఖాస్తులను ఒకే తరహాలో పరిగణించాలని సెబీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
వివిధ డీమ్యాట్ల ద్వారా: ఒకే డీమ్యాట్ ద్వారా ఎక్కువ మొత్తం షేర్లకు దరఖాస్తు చేసుకోవడానికి బదులు.. పలు డీమ్యాట్ ఖాతాల ద్వారా బిడ్లు దాఖలు చేయడం మేలు. అప్పుడు ఏదో ఒకదానికి షేర్లు అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది.
చివరి నిమిషంలో వద్దు: చివరి నిమిషంలో హడావుడిగా దరఖాస్తు చేస్తే తప్పులు దొర్లే అవకాశం ఉంది. అందుకే ఐపీఓలో పాల్గొనాలని నిర్ణయించుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ ప్రారంభమైన రోజే దరఖాస్తు చేసుకుంటే మేలు.
మాతృసంస్థ షేర్లు ఉంటే మేలు: ఏదైనా సంస్థ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంటున్నారంటే.. దాని మాతృసంస్థ షేర్లు ముందే మీ ఖాతాలో ఉండేలా చూసుకోండి. అలాంటప్పుడు వాటాదారుల కేటగిరీ కింద షేర్లు కేటాయించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఏదైనా ఐపీఓకి దరఖాస్తు చేసుకునే ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. దాన్ని పూర్తిగా పరిశీలించాలి. లేదంటే ఆర్థిక నిపుణులు సాయం తీసుకోవడం మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు