Jio laptop: జియో ల్యాప్టాప్ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!
Jio laptop: జియో ఎట్టకేలకు తన ల్యాప్టాప్ను విక్రయానికి ఉంచింది. అయితే, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే.
ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ జియో (Jio) నుంచి ఓ ల్యాప్టాప్ (Laptop) రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీంతో తొలి నుంచీ ఈ ల్యాప్టాప్పై భారీ అంచనాలు ఉన్నాయి. ధర, స్పెసిఫికేషన్ల గురించి ఎప్పటి నుంచో లీకులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆ కంపెనీ తన తొలి ల్యాప్టాప్ను విడుదల చేసింది. అయితే, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) పోర్టల్లో ప్రస్తుతానికి దీన్ని విక్రయానికి ఉంచారు. సాధారణ వినియోగదారుల కోసం ఈ దీపావళికి ఈ ల్యాప్టాప్ను విడుదల చేయనున్నారు.
జీఈఎం పోర్టల్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ ల్యాప్టాప్ను నెట్బుక్గా పేర్కొన్నారు. ధరను రూ.19,500గా నిర్ణయించారు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 అక్టాకోర్ ప్రాసెసర్ ఇస్తున్నారు. జియో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ల్యాప్టాప్ పనిచేస్తుంది. 2జీబీ ఎల్పీడీడీఆర్ 4X ర్యామ్ను ఇస్తున్నారు. ర్యామ్ను పెంచుకునే సదుపాయం ఇవ్వలేదు. 32జీబీబీ eMMC స్టోరేజ్ ఇస్తున్నారు.
డిస్ప్లే విషయానికొస్తే.. 11.6 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ బ్యాక్లిట్ యాంటీగ్లేర్ డిస్ప్లేతో ఈ ల్యాప్టాప్ను తీసుకొస్తున్నారు. 1366× 768 పిక్సల్ రెజల్యూషన్తో ఈ డిస్ప్లే అందిస్తున్నారు. టచ్స్క్రీన్ సదుపాయం లేదు. యూఎస్బీ 2.0 పోర్ట్, యూఎస్బీ 3.0, హెచ్డీఎంఐ పోర్టులు ఇస్తున్నారు. యూఎస్బీ టైప్-సి పోర్ట్ లేదు. వైఫై 802.11acకి ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2, 4జీ మొబైల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీతో ఈ ల్యాప్టాప్ను తీసుకొస్తున్నారు. డ్యూయల్ ఇంటర్నల్ స్పీకర్స్, డ్యూయల్ మైక్రోఫోన్స్, స్టాండర్డ్ కీబోర్డ్, మల్టీ గెశ్చర్ సపోర్ట్ కలిగిన టచ్ప్యాడ్ ఇస్తు్న్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం లేదు. ఇందులో అమర్చిన బ్యాటరీ 6.1 నుంచి 8 గంటల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ప్రస్తుతం 10 ల్యాప్టాప్లు మాత్రమే విక్రయానికి ఉంచినట్లు పోర్టల్ ద్వారా తెలుస్తోంది. అది కూడా కేవలం మహారాష్ట్రకు మాత్రమే డెలివరీలు ఇస్తున్నారు. దీపావళికి సాధారణ ప్రజలకు విడుదల చేసే ల్యాప్టాప్ ధర కూడా ఇంతే ఉంటుందా? అనేది తెలియ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ముదురు నీలం కలర్లో మాత్రమే పోర్టల్లో కనిపిస్తోంది. వేరే రంగుల్లోనూ లభిస్తుందా? లేదా? అనేది కూడా చూడాలి మరి!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.