Jio-Tesla: భారత్లో టెస్లా యూనిట్.. రిలయన్స్ జియో చర్చలు!
ఎలాన్ మస్క్ (Elon Musk) ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla)తో రిలయన్స్ జియో (Reliance Jio) చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో టెస్లా కంపెనీ భారత్కు రావడం ఖరారైనట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ముంబయి: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్లో తయారీ యూనిట్ను నెలకొల్పనుందని గత కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో టెస్లాకు అవసరమైన ప్రైవేట్ 5జీ నెట్వర్క్(5G Network)ను రిలయన్స్ జియో (Reliance Jio) అందిచనుందని సమాచారం. ఈ మేరకు జియో సంస్థ టెస్లా ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు కంపెనీ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. దీంతో టెస్లా కంపెనీ భారత్కు రావడం ఖరారైనట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
గత వారం టెస్లా సంస్థ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, టెస్లాతో రిలయన్స్ జియో చర్చలు మస్క్ (Elon Musk) కంపెనీ భారత్కు రాబోతుందనే సంకేతాలకు బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, టెస్లా తయారీ యూనిట్ ఎక్కడ నెలకొల్పుతుందనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటే.. జియో నెట్వర్క్పై స్పష్టత వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. టెస్లాతోపాటు త్వరలో భారత్కు రాబోయే ఆటోమొబైల్, హెల్త్కేర్, తయారీ పరిశ్రమలకు కూడా 5జీ నెట్వర్క్ అందించేందుకు ఆయా సంస్థలతో జియో చర్చలు జరుపుతోందని సమాచారం.
ఇండస్ట్రీ 4.0 అందిపుచ్చుకోవడంలో భాగంగా పలు పరిశ్రమలు టెలికాం సంస్థలతో జట్టు కడుతున్నాయి. దీంతో ఆయా సంస్థలకు వేగవంతమైన నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా డేటా మార్పిడి సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పటికే మహీంద్రా సంస్థకు చెందిన చకాన్ యూనిట్కు 5జీ నెట్వర్క్ను అందించేందుకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు టెలికాం సంస్థలతో కలిసి సొంత 5జీ నెట్వర్క్ను నెలకొల్పుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్