Reliance: మరో రెండు సౌర కంపెనీలతో రిలయన్స్ ఒప్పందం!
2030 నాటికి 100 గిగావాట్ల సౌరవిద్యుత్తు ప్రాజెక్టులను ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్).. ఆ దిశగా మరో ముందడుగు వేసింది...
దిల్లీ: 2030 నాటికి 100 గిగావాట్ల సౌరవిద్యుత్తు ప్రాజెక్టులను నెలకొల్పాలనే లక్ష్యంతో ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్).. ఆ దిశగా మరో ముందడుగు వేసింది. జర్మనీకి చెందిన నెక్స్వేఫ్ అనే సంస్థలో 25 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. ‘సోలార్ వేఫర్ల’ను ఉత్పత్తి చేసే ఈ సంస్థకు చెందిన సాంకేతికతను వాడుకొని రిలయన్స్ భారత్లో భారీ వేఫర్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ల కోసం డెన్మార్క్కు చెందిన స్టైస్డల్ ఏ/ఎస్ అనే కంపెనీతోనూ రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకొంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఈ కంపెనీ తయారు చేస్తున్న హైడ్రెజన్ ఎలక్ట్రోలైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో పోలిస్తే.. వీటి వాడకం వల్ల ఖర్చు భారీగా తగ్గుతుంది. అలాగే భవిష్యత్తులో స్వచ్ఛ ఇంధనం, పర్యావరణ మార్పులే లక్ష్యంగా పలు ఆధునిక సాంకేతికతల అభివృద్ధి, అమలులోనూ ఇరు సంస్థలు కలిసి పనిచేసేలా ఒప్పందం కుదిరింది.
అనుబంధ సంస్థ ‘రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (ఆర్ఎన్ఈఎస్ఎల్)’ ద్వారా రిలయన్స్ ఈ రంగంలో పెట్టుబడులు పెడుతోంది. ఇటీవలే నార్వేకు చెందిన సౌర ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్ను 771 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. అలాగే దేశీయంగా స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్లోనూ 40 శాతం వాటాను రూ.2,845 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు