RIL Q3 Results: రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభంలో 15 శాతం క్షీణత
RIL Q3 Results: రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభం 15 శాతం మేర క్షీణించింది.
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) త్రైమాసిక ఫలితాలను (Q3 Results) ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి గానూ నికర లాభం 15 శాతం క్షీణత నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికానికి రూ.18,549 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ఈ సారి రూ.15,792 కోట్లు ఆర్జించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ.1,91,271 కోట్ల నుంచి రూ.2,20,592 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ క్యూ3లో రూ.2,400 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్యూ2తో పోలిస్తే ఆదాయం 6.24 శాతం మేర పెరగడం గమనార్హం. ఆపరేషన్ ద్వారా వచ్చే ఆదాయం రూ.60,096 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.
- రిలయన్స్కు చెందిన టెలికాం విభాగం జియో మూడో త్రైమాసికంలో రూ.4,638 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 28.3 శాతం అధికం. మొత్తం ఆదాయం సైతం రూ.19,347 కోట్ల నుంచి రూ.22,993 కోట్లకు పెరిగినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు 134 నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
- ఫలితాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ... సవాలుతో కూడిన వాతావరణంలోనూ వ్యాపార బృందాలు అద్భుతమైన పనితీరును కనబరిచాయని ప్రశంసించారు. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో 1.1 శాతం క్షీణించి రూ.2,443 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!