5G phones: 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా? తక్కువకే వస్తుందని కొంటే అంతే!
5g phone buying guide: 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకునేవారు ఈ విషయాలు తెలుసుకోండి..
5g phone buying guide: 5జీ వేలం ప్రక్రియ ముగిసింది. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు టెలికాం కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. తొలుత నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దశలో చాలా మందికి వచ్చే సందేహం.. ఏ ఫోన్ కొనాలి? అని. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటే.. 5జీ ఫోన్ కొనుగోలును కొద్ది రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ నగరాలు, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేవారైతే 5జీ ఫోన్ కొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తక్కువ ధరకే 5జీఫోన్ వస్తుందని కొనుగోలు చేస్తే ఆ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ వివరాలు తెలుసుకోవడం మంచిది.
ఏ టెల్కో ఏ బ్యాండ్..?
5జీ ఫోన్ కొనుగోలు చేసే ముందు ఏ టెలికాం కంపెనీ ఏ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మొత్తం 10 బ్యాండ్లను కేంద్రం వేలానికి ఉంచగా.. రిలయన్స్ జియో 700 MHz, 800 MHz, 1800 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లలో 24.740 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రాన్ని వేలంలో సంపాదించింది. ఎయిర్టెల్ 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లలో 19.86 GHz స్పెక్ట్రాన్ని వేలంలో దక్కించుకుంది. వొడాఫోన్ ఐడియా 1800 MHz, 2100 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో 6.22 GHz స్పెక్ట్రాన్ని కొనుగోలు చేసింది.
మనం చూడాల్సిందేంటి?
మార్కెట్లో 5జీ ఫోన్ల సందడి ఈ మధ్య జోరుగా కనిపిస్తోంది. ఇప్పడొస్తున్న స్మార్ట్ఫోన్లలో దాదాపు అన్ని ఫోన్లూ 5జీకి సపోర్ట్ చేస్తున్నాయి. అలాగని ఫోన్లలో ఉండే చిప్సెట్లూ అన్ని బ్యాండ్లకూ సపోర్ట్ చేయకపోవచ్చు. కాబట్టి మీరు కొనుగోలు చేయబోయే ఫోన్ అన్ని బ్యాండ్లకూ సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలి. ఫోన్ తయారీ కంపెనీలు ఏయే బ్యాండ్లకు తమ ఫోన్ సపోర్ట్ చేస్తుందో N అనే అక్షరంతో అది సపోర్ట్ చేసే బ్యాండ్ను సూచిస్తుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కొనుగోలు చేసిన బ్యాండ్లను ఈ విధంగా చూసినప్పుడు.. 700 MHz (N28), 800 MHz (N20), 900 MHz (N8), 1800 MHz (N3), 2300 MHz (N30/N40), 2500 MHz (N41), 3300 MHz (N78), 26 GHz (N258)గా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ₹20 వేల నుంచి ₹30వేల బడ్జెట్లో ఉండే ఫోన్లు దాదాపు అన్ని బ్యాండ్లకూ సపోర్ట్ చేస్తాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫోన్లు మాత్రం పరిమిత సంఖ్యలో బ్యాండ్లను మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ మీరు కొత్త 5జీ ఫోన్ కొనాలనుకుంటే లేటెస్ట్గా వచ్చిన ఫోన్లను కొనడం ఉత్తమం. తక్కువ ధరకు వస్తున్నాయని పాత ఫోన్లు కొంటే.. నిర్దేశించిన 5జీ బ్యాండ్లకు అవి సపోర్ట్ చేయకపోతే డబ్బులన్నీ వృథా అయినట్లే. కాబట్టి ఫోన్ కొనేముందు ఈ బ్యాండ్లను చూడడం మరిచిపోవద్దు.
ఇవీ చూడడం మరిచిపోవద్దు..
ఒకవేళ 5జీ సేవలను పూర్తిగా ఆనందించాలనుకుంటే నాసిరకం ఫోన్లను కొనుగోలు చేయొద్దు. కొంచెం ఖర్చుతో కూడుకున్నా.. ఖరీదైన ఫోన్లనే కొనుగోలు చేయడం ఉత్తమం. మార్కెట్లో 5జీ సందడి ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి కొద్ది రోజులయ్యాక వీటి ధరలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చు. అలాగే, 5జీ నెట్వర్క్కు ఎక్కువ బ్యాటరీ అవసరం అవుతుంది. కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకునేవారు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండేట్లు చూసుకోవడం మంచిది. యాపిల్ ఫోన్లు కొనుగోలు చేసేవారు ఐఫోన్ 11 సిరీస్ ఆ తర్వాత వచ్చిన ఫోన్లను కొనడం ఉత్తమం.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి