రిటైల్ మ‌దుప‌ర్లు విదేశాల్లో పెట్టుబ‌డి చేయోచ్చు

విదేశాల్లో పెట్టుబ‌డి చేయ‌డం వ‌ల్ల లాభం ఏంటి? ఎప్పుడు, ఎలా చేయాలి? అస‌లు ఎందుకు చేయాలి? త‌దిత‌ర‌ విష‌యాల‌ను తెలుసుకుందాం.........

Published : 19 Dec 2020 10:43 IST

విదేశాల్లో పెట్టుబ‌డి చేయ‌డం వ‌ల్ల లాభం ఏంటి? ఎప్పుడు, ఎలా చేయాలి? అస‌లు ఎందుకు చేయాలి? త‌దిత‌ర‌ విష‌యాల‌ను తెలుసుకుందాం.​​​​​​​

విదేశీ పెట్టుబ‌డులో మ‌దుపు చేయడం చిన్న మ‌దుప‌ర్ల‌కు లాభం ఏంట‌నుకుంటున్నారా? ఉంటుంది. దీనికి సంబంధించి ఐదు విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకు చేయాలి?

చిన్న మ‌దుప‌ర్లు విదేశీ పెట్టుబ‌డుల్లో మ‌దుపు చేయ‌డం ద్వారా భౌగోలికంగా ఉండే న‌ష్ట భ‌యాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. దీన్నే జియోగ్ర‌ఫిక‌ల్ రిస్క్ అంటారు. అంటే ఒక దేశంలో ఉండే ఆర్థిక ప‌రిస్థితులు వేరొక దేశంలో ఉండే ఆర్ధిక ప‌రిస్థితుల‌కు భిన్నంగా ఉండొచ్చు. త‌ద్వారా ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రంగా ఒక దేశంలో ఏదైనా ప్ర‌తికూల‌త‌లుంటే వేరొక దేశంలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా త‌గ్గించుకోవ‌చ్చు.

ఎప్పుడు చేయాలి?

ప్ర‌స్తుతం డాల‌ర్ విలువ తో పోలిస్తే రూపాయి బ‌ల‌హీన‌ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో క‌రెన్సీలో వ‌చ్చే హెచ్చుత‌గ్గుల ప్రభావాన్ని త‌గ్గించేందుకు విదేశీ కంపెనీల్లో పెట్టుబ‌డి చేయ‌డం ఒక ఎంపిక‌గా చెప్ప‌వ‌చ్చు.

ఎలా చేయాలంటే…

విదేశాల్లో పెట్టుబ‌డులు చేయాలంటే ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగా మ‌దుపుచేయ‌వ‌చ్చు. మ‌న దేశంలో ఉండే బ్రోకింగ్ సంస్థ‌లు విదేశాల్లో ఉన్న బ్రోకింగ్ సంస్థ‌ల‌తో ఒప్పంద క‌లిగి ఉండ‌టం లేదా నేరుగా విదేశీ పెట్టుబ‌డుల‌ను చేసే అర్హ‌త క‌లిగి ఉండే పెట్టుబ‌డి నిర్వ‌హ‌ణ సంస్థ‌ల ద్వారా ప్ర‌త్య‌క్షంగా పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు.

విదేశీ కంపెనీల్లో, ఈటీఎఫ్ ల్లో పెట్టుబ‌డి చేసే ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్ట‌బ‌డి చేయ‌డం ద్వారా ఎన్ఏవీ రూపాయిల్లో ఉండే ఫండ్ల‌లో కూడా మ‌దుపు చేయ‌వ‌చ్చు. నేరుగా కాకుండా ప‌రోక్ష పెట్టుబ‌డి సాధ‌నాల ద్వారా మ‌దుపు చేస్తున్న‌ట్లు అవుతుంది.

ఎంత చేయోచ్చు?

రిజ‌ర్వు బ్యాంకు లిబ‌ర‌లైజెడ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ద్వారా అనుమ‌తించిన ప‌రిమితి 2,50,000 డాల‌ర్లు . ఏవిధ‌మైన అనుమ‌తి లేకుండా ఒక భార‌తీయ మ‌దుప‌రి ఒక ఆర్థిక సంవ‌త్స‌రానికి 2.5 ల‌క్ష‌ల డాల‌ర్ల వ‌ర‌కూ పెట్టుబ‌డుల‌ను చేయ‌వ‌చ్చు.

ప‌న్ను విధానం:

విదేశాల్లో పెట్టుబ‌డి చేస్తే ప‌న్ను ఎలా ఉంటుంద‌నేది ముందుగా తెలుసుకోవాలి. ప్ర‌స్తుతం ప‌రోక్షంగా విదేశీ ఈక్విటీ పెట్టుబ‌డులు చేసే వారికి ప‌న్ను దీర్ఘ‌కాలిక మూలధ‌న ఆదాయంపై వాటిపై ఇండెక్షేష‌న్ తో 20 శాతం ఉంటుంది. దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ఆదాయంపై ఇండెక్షేష‌న్ తో 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మ‌న దేశంలో ఈక్విటీ పెట్టుబ‌డులు అయితే దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ఆదాయంపై ప‌న్ను(ఏడాదిపైబ‌డి) 10 శాతం ఉంటుంది.( రాబ‌డి ల‌క్ష‌కు మించితే). ఒక విధంగా చెప్పాలంటే ద్ర‌వ్యోల్బ‌ణ అంచ‌నాతో చూస్తే ఇండెక్షేష‌న్ తో 20 శాతం ప‌న్ను దాదాపుగా ఇండెక్షేష‌న్ లేకుండా 10 శాతం ప‌న్నుకు ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది.

నేరుగా విదేశీ ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్లు లేదా షేర్ల‌లో మ‌దుపుచేసే వారికి ఏడాదికి మించి కొనసాగించిన పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే ఆదాయాన్ని దీర్ఘ‌కాలిక‌ మూల‌ధ‌న ఆదాయం గా ప‌రిగ‌ణిస్తారు. దీనిపై ఇండెక్షేష‌న్ లేకుండా 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న ఆదాయంపై వ్య‌క్తిగ‌త ప‌న్ను స్లాబు వ‌ద్ద‌ప‌న్ను చెల్లించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని