jio world centre: ముంబయిలో జియో వరల్డ్ సెంటర్ ప్రారంభం
దేశంలోనే ప్రతిష్టాత్మక, అతిపెద్ద బహుముఖ గమ్యస్థానమైన జియో వరల్డ్ సెంటర్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించింది. ఆ సంస్థ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేన్ ఫౌండర్ ఛైర్పర్సన్ నీతా అంబానీ...
ముంబయి: దేశంలోనే ప్రతిష్టాత్మక, అతిపెద్ద బహుముఖ గమ్యస్థానమైన జియో వరల్డ్ సెంటర్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించింది. ఆ సంస్థ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేన్ ఫౌండర్ ఛైర్పర్సన్ నీతా అంబానీ దీన్ని శుక్రవారం ప్రారంభించారు. ముంబయిలోని బాంద్రా కుంద్రా కాంప్లెక్స్లోని 18.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక గమ్యస్థానంగా ఈ కేంద్రం దేశానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురానుందని జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది, వచ్చే ఏడాది దశలవారీగా ఈ వరల్డ్ సెంటర్ అందుబాటులోకి రానుంది.
ఈ జియో వరల్డ్ సెంటర్లో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్ ఫౌంటైన్, ఉన్నత స్థాయి రిటైల్ అనుభవం, కెఫెలు, చక్కటి డైనింగ్ రెస్టారెంట్లు, సర్వీస్డ్ అపార్ట్మెంట్లు, ఆఫీసులు ఉన్నాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ..‘‘జియో వరల్డ్ సెంటర్ మన దేశానికి అంకితం. నవ భారతదేశ ఆకాంక్షలకు ఈ సెంటర్ ప్రతిబింబం. అతిపెద్ద సమావేశాల నుంచి సాంస్కృతిక అనుభవాల వరకు, రిటైల్ నుంచి డైనింగ్ సౌకర్యాల వరకు ఇలా ప్రతి విషయంలోనూ జియో వరల్డ్ సెంటర్ ద్వారా ముంబయి గమ్యస్థానం కానుంది’’ అని చెప్పారు. ఇది దేశ అభివృద్ధికి ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని చెప్పారు.
అలాగే, ధీరూబాయ్ అంబానీ స్క్వేర్, ఫౌంటైన్ ఆఫ్ జాయ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటకులు, స్థానికులు తప్పక చూడాల్సిన ప్రదేశంగా ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ నిలుస్తుందని ఈ సందర్భంగా నీతా అంబానీ పేర్కొన్నారు. ముంబయికి ల్యాండ్ మార్క్గా ఉంటుందన్నారు. అందరూ తిలకించే విధంగా ఉచిత ప్రవేశంతో సర్వాంగ హంగులతో ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ రూపుదిద్దుకుందని చెప్పారు. ఫౌంటైన్ ఆఫ్ జాయ్ చుట్టూ దీరూభాయ్ స్క్వేర్ ఉంది. ఇక ఫౌంటైన్ ఆఫ్ జాయ్లో ఎనిమిది ఫైర్ షూటర్లు, 392 వాటర్ జెట్లు, 600కు పైగా ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. ఇవి సంగీతానికి అనుగుణంగా కదలాడి మరపురాని అనుభవాన్ని ఇస్తాయి. మ్యూజికల్ ఫౌంటైన్, ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ను ముంబయికి అంకితం ఇస్తున్నందుకు గర్వంగా ఉందని నీతా అంబానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్