Samsung: ఒక్కరోజులో ₹ వెయ్యి కోట్ల విలువైన ఫోన్ల విక్రయం.. టాప్ సెల్లింగ్ మోడల్ ఇదే!
శాంసంగ్ కంపెనీ ఆదివారం ఒక్కరోజే 12 లక్షలకు పైగా మొబైల్ ఫోన్లను విక్రయించినట్లు ప్రకటించింది...
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీ శాంసంగ్ పండుగ అమ్మకాల్లో రికార్డు స్థాయిలో ఫోన్లను విక్రయించింది. ఆదివారంనాడు ఒక్కరోజే ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా సుమారు 12 లక్షల శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు అమ్ముడైనట్లు ప్రకటించింది. వీటి విలువ ₹ వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. పండుగ సీజన్లో భాగంగా శాంసంగ్ ఫోన్లపై 17 నుంచి 60 శాతం ధరల తగ్గింపును ప్రకటించింది. వీటిలో ప్రీమియం శ్రేణి మోడల్స్పై 17 నుంచి 38 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఈ అమ్మకాలతో అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్లో శాంసంగ్ బ్రాండ్ మొదటి స్థానంలో నిలవడంతోపాటు, బిగ్ బిలియన్ డే సేల్స్ ద్వారా జరిగిన అమ్మకాలతో తమ కంపెనీ ఫ్లిప్కార్ట్ మార్కెట్ పరిధి రెండింతలు పెరిగినట్లు శాంసంగ్ ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, గెలాక్సీ ఎస్22 అల్ట్రా, గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎమ్53, గెలాక్సీ ఎమ్33, గెలాక్సీ ఎమ్32 ప్రైమ్ ఎడిషన్, గెలాక్సీ ఎమ్13 మోడల్స్ ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో ఉన్నాయి. వీటిలో గెలాక్సీ ఎమ్13 బెస్ట్ సెల్లింగ్ మోడల్గా నిలిచిందని తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 మిడ్-రేంజ్ మోడల్. సాధారణ, 5జీ వేరియంట్లో లభిస్తుంది. గెలాక్సీ ఎమ్13లో 6.6 అంగుళాల ఫుల్హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారు. ఎక్సినోస్ 850 ప్రాసెసర్ను ఉపయోగించారు. వెనుక 50ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్యూఐ కోర్ 4 ఓఎస్తో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్/ 64 జీబీ ధర ₹ 9,499, 6 జీబీ/128 జీబీ ధర ₹ 11,499. ఈ మోడల్ 5జీ వేరియంట్ 4 జీబీ/64 జీబీ ధర ₹ 11,499, 6 జీబీ/ 128 జీబీ ధర ₹13,999.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు