Satya Nadella: క్రికెట్ ఆట నుంచి టెక్ కంపెనీ సీఈవో దాకా.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన సత్య నాదెళ్ల!
చిన్నవయసులో తన ధ్యాసంతా ఎక్కువగా క్రికెట్పై ఉండేదని, చదువులో కూడా గొప్ప రాణించేవాణ్ని కాదని చెప్పారు మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella). నాయకత్వం అనేది విశేషాధికారమో, ప్రత్యేకమైన సౌకర్యమో మాత్రమే కాదని అన్నారు.
కాలిఫోర్నియా: చిన్నవయసులో తల్లిదండ్రులు ఇచ్చిన మద్దతు, ఆత్మవిశ్వాసం, నచ్చిన అంశాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) అన్నారు. లింక్డిన్ (LinkedIn') సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ(Ryan Roslansky) నిర్వహించే ది పాత్ (The Path) అనే వీడియో సిరీస్ కార్యక్రమంలో పాల్గొన్న సత్య నాదెళ్ల పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.
వారి వల్లే ఈ స్థాయికి
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నేను ఈ స్థాయిలో ఉండటం వెనుక నా తల్లిదండ్రుల పాత్ర ఉంది. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్థికవేత్త. అమ్మ సంస్కృతం ప్రొఫెసర్గా పనిచేసేవారు. వారిద్దరు రెండు వేర్వేరు ధృవాలు అని చెప్పుకోవాలి. ఏ విషయంపైనా వారికి ఏకాభిప్రాయం ఉండేది కాదు. కానీ, నా విషయంలో మాత్రం ఇద్దరు ఒకే మాటపై ఉండేవారు. నా అభిరుచికి తగినట్లుగా ముందుకు సాగేందుకు ఎప్పుడు అడ్డుచెప్పలేదు. నాలో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు ఎంతో కృషి చేశారు.
క్రికెట్ నుంచి కంప్యూటర్వైపు
చిన్నవయసులో నా ధ్యాసంతా ఎక్కువగా క్రికెట్పై ఉండేది. చదువులో కూడా గొప్పగా రాణించేవాణ్ని కాదు. భారత్లో మధ్యతరగతి కుటుంబంలో పెరగడం కొన్నిసార్లు సవాల్తో కూడుకున్న వ్యవహారం. తొలిసారి కంప్యూటర్ వినియోగించిన సందర్భం ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయంలో అమెరికన్ టెక్నాలజీ నన్ను కట్టిపడేసింది. అలాంటి సందర్భాల్లో అందరిలా అదే నా భవిష్యత్తు అని నిర్ణయించుకున్నానని నేను చెప్పలేదు. దాన్ని ఉపయోగించే కొద్ది అది నన్ను ఆకర్షించింది.
సన్ మైక్రోసిస్టమ్ టు మైక్రోసాఫ్ట్
భారత్లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సత్య నాదెళ్ల మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్లారు. అది పూర్తయ్యాక ఆయన సన్ మైక్రోసిస్టమ్స్(Sun Microsystems)లో ఉద్యోగంలో చేరారు. అప్పట్లో కంప్యూటర్లకు అవసరమైన సాంకేతికతను అందించే సంస్థల్లో సన్ మైక్రోసిస్టమ్స్ చాలా పెద్దది. తర్వాత 1992లో సత్య నాదెళ్ల విండోస్ ఎన్టీ (Windows NT) ప్రాజెక్ట్ కోసం మైక్రోసాఫ్ట్లో చేరారు. మైక్రోసాఫ్ట్ సంస్థ విడుదల చేసిన తొలి విండోస్ ఓఎస్ ఇదే. తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్కు చెందిన బింగ్ (Bing), ఎమ్ఎస్ ఆఫీస్ (Microsoft Office), ఎక్స్బాక్స్ లైవ్ (XBOX Live), క్లౌడ్ సాంకేతికతకు సంబంధించిన ఈవీపీ(EVP) వంటి వాటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
సక్సెస్ సీక్రెట్
30 ఏళ్ల పాటు ఒకే సంస్థలో పనిచేయడం గురించి మాట్లాడుతూ..‘‘ 1992లో 22 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగంలో చేరాక, ఈ ప్రపంచంలోనే గొప్ప ఉద్యోగం చేస్తున్నానని అనుకునేవాణ్ని. నేను చేస్తున్న పని గొప్పదనే భావనతో ఉండేవాణ్ని. మరో చోటికి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు ఉండేది కాదు. ఇప్పటికీ చాలా మంది కెరీర్కు సంబంధించి మంచి సలహా ఇవ్వమని అడుగుతుంటారు. వారికి నేను చెప్పేదొక్కటే.. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దని చెబుతాను. నేను సీఈవో అయ్యే ముందు రోజు వరకు నాకు అలాంటి ఆలోచనేలేదు’’అని చెప్పారు.
నాయకత్వం అనేది విశేషాధికారమో, ప్రత్యేకమైన సౌకర్యమో మాత్రమే కాదని అన్నారు. ఇతరులకు నాయకత్వం వహిస్తున్నప్పుడు.. సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను కనుగొన్నప్పుడు మాత్రమే దానికి మనం అర్హులమని భావించాలి. అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురు చూడకుండా.. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే నాయకుడు తన బృందాన్ని విజయపథంలో నడిపించగలుగుతాడని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్