Budget 2023: ‘కిసాన్’ వడ్డీ చెల్లిస్తే సరిపోతుందా..? బడ్జెట్పై ఎస్బీఐ రీసెర్చ్ అంచనాలు!
Budget 2023: రాబోయే బడ్జెట్పై వివిధ సంస్థలు తమ అంచనాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ తమ నివేదికను విడుదల చేసింది.
దిల్లీ: ఓవైపు ఆర్థిక మాంద్యం భయాలు, మరోవైపు అస్థిర ఆర్థిక పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ (Budget 2023) ప్రవేశపెట్టనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ 2.0కు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ (Budget 2023) కావడం కూడా అంచనాలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ (Budget 2023)పై అనేక సంస్థలు తమ అభిప్రాయాలు, అంచనాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ సైతం పలు రంగాలపై తమ అంచనాలను బయటపెట్టింది.
చిన్న మొత్తాల పొదుపులకు బూస్ట్..
‘సుకన్య సమృద్ధి యోజన (SSY)’ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలకు రాబోయే బడ్జెట్ (Budget 2023)లో ప్రాధాన్యం ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరం 6 శాతం వరకు చేరొచ్చని అంచనా వేసింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపైనే ప్రధానంగా ఆధారపడే అవకాశం ఉందని తెలిపింది. కొత్త రిజిస్ట్రేషన్లను పెంచడం కోసం ప్రత్యేక డ్రైవ్ను ప్రకటించొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం తపాలాశాఖలతో పోలిస్తే బ్యాంకుల్లో చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో కూడా ఖాతాల సంఖ్యను పెంచడం కోసం ప్రత్యేకంగా బిజినెస్ కరెస్పాండెంట్లను నియమించుకునే అవకాశం కల్పించొచ్చని తెలిపింది.
సీనియర్లకు ఊతం..
ధరలు పెరిగి కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా బడ్జెట్ (Budget 2023)పై సీనియర్ సిటిజన్స్ సైతం అనేక ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ వర్గం చేసే డిపాజిట్లపై వచ్చే వడ్డీ మినహాయింపు పరిమితి పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుతం సెక్షన్ 80టీటీబీ కింద సేవింగ్స్, ఫిక్స్డ్, రికరింగ్ ఖాతాల్లో చేసే డిపాజిట్లపై వచ్చే వడ్డీకి రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని రూ.75,000 నుంచి రూ. 1 లక్ష వరకు పెంచాల్సిన అవసరం ఉందని సీనియర్ సిటిజన్స్ నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్.
కిసాన్ వడ్డీ చెల్లిస్తే చాలు..
రాబోయే బడ్జెట్ (Budget 2023)లో పలు వ్యవసాయ పథకాలకు కూడా ప్రోత్సాహకాలు ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. చిన్న, సన్నకారు రైతులు కిసాన్ క్రెడిట్ కార్డును మరింత సమర్థంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కేవలం వడ్డీ చెల్లించినా రుణాన్ని రెన్యూవల్ చేసేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం వ్యవసాయ, అనుబంధ రంగాల రుణ బకాయిల్లో 60% కేసీసీ ఆధారితమైనవే.
అప్పు రూ.16 లక్షల కోట్లు..
మరోవైపు 2023- 24లో ప్రభుత్వ నికర అప్పులు రూ.11.7 లక్షల కోట్లకు చేరొచ్చని నివేదిక అంచనా వేసింది. మరో రూ. 4.4 లక్షల కోట్లు ఇప్పటికే తీసుకున్న అప్పులకు చెల్లింపులు చేయాల్సి ఉందని తెలిపింది. దీన్ని కూడా కలిపితే మొత్తం అప్పులు రూ. 16.1 లక్షల కోట్ల వరకు చేరొచ్చని లెక్కగట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?