ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ
పెరిగిన వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వచ్చాయి
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ దిగ్గజ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం కొత్త డిపాజిట్లతో పాటు ప్రస్తుతం ఉన్న డిపాజిట్లకు కూడా వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. అలాగే రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.
ప్రస్తుతం రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్బీఐ అందించే వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలిస్తే.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల పై సాధారణ ఖాతాదారులకు 2.9 శాతం నుంచి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లు మాత్రం ఈ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు అదనంగా పొందుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్