Stock Market: ఆర్బీఐ నిర్ణయాల వేళ మార్కెట్ సూచీల్లో అప్రమత్తత!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి...
ముంబయి: నేడు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సైతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య ఉదయం 9:22 గంటల సమయానికి సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 56,291 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 16,796 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.52 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, నెస్లే ఇండియా, ఎల్అండ్టీ, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, పవర్గ్రిడ్, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
నేడు గమనించాల్సిన స్టాక్స్...
హీరో మోటోకార్ప్: అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న జీరో మోటార్సైకిల్స్తో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యం కుదుర్చుకొంది. ఇరు కంపెనీలు కలిసి ఖరీదైన విద్యుత్తు ద్విచక్రవాహనాలు, వాటి పవర్ట్రెయిన్లను తయారు చేయనున్నాయి. ఈ మేరకు జీరో మోటార్సైకిల్స్లో 60 మిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు హీరో మోటోకార్ప్ బోర్డు ఆమోదం తెలిపింది.
పీఎన్బీ: ‘ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీ ఇండియా లిమిటెడ్ (ARCIL)’లో ఉన్న తమ మొత్తం 10.01 శాతం వాటాలను విక్రయించాలని ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)’ నిర్ణయించింది.
రైల్ వికాస్ నిగమ్: ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు 4 వరుసల రహదారి నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టును ఎన్హెచ్ఏఐ నుంచి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దక్కించుకుంది.
టాటా కమ్యూనికేషన్స్: పుణెలో టాటా కమ్యూనికేషన్స్ ప్రైవేట్ 5జీ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..