Stock market: ఆద్యంతం నష్టాల్లో దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో సెన్సెక్స్ వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు మరికొంతకాలం కొనసాగించనుందనే అంచనాలతో యూఎస్ సూచీలు నిన్నటి ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో ముగిశాయి. దాని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపైనా పడింది. క్రూడాయిల్ ధరల పెరుగుదల ప్రభావం చూపింది. మరోవైపు బుధవారం ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనుండడంతో మదుపరులు అప్రమత్తత పాటించారు. ముఖ్యంగా మెటల్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో సెన్సెక్స్ వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82 పైసలు క్షీణించి 82.61 వద్ద స్థిరపడింది.
ఉదయం 62,395 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఓ దశలో 400 పాయింట్లకు పైగా నష్టాలోకి వెళ్లిన సూచీ చివరికి 208.24 పాయింట్ల నష్టంతో 62,626.36 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 58.20 పాయింట్ల నష్టంతో 18,642.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్, నెస్లే యాక్సిస్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు