Stock Market: కొనసాగుతున్న లాభాల పరంపర.. 18,650 ఎగువన నిఫ్టీ
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో లాభాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్లలో మాత్రం సానుకూలతలు కొనసాగుతున్నాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ట్రేడింగ్ను ప్రారంభించాయి. కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే స్పష్టమైన లాభాల్లో ఎగబాకాయి. గత కొన్ని రోజుల ట్రెండ్ను కొనసాగిస్తూ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు రాణిస్తున్నాయి. అయితే, సూచీలు గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్న నేపథ్యంలో ఈరోజు కొంత స్థిరీకరణ దిశగా పయనించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నేడు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక సదస్సులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రేట్ల పెంపుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీనిపైనా మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.
ఈ పరిణామాల మధ్య ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంతో 62,762 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు ఎగబాకి 18,654 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.58 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, విప్రో, రిలయన్స్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
గమనించాల్సిన స్టాక్స్...
గ్లాండ్ ఫార్మా: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లాండ్ ఫార్మాలో వాటాను, ఆ సంస్థ ప్రమోటర్గా ఉన్న చైనా సంస్థ ఫోసున్ ఫార్మా విక్రయించనున్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారమవుతోంది.
అదానీ ఎంటర్ప్రైజెస్: అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓలో షేర్లను రాయితీ ధరకే ఇవ్వడం ద్వారా చిన్న మదుపర్లను ఆకర్షించాలని చూస్తున్నట్లు కంపెనీ సీఎఫ్ఓ జుగేషిందర్ సింగ్ పేర్కొన్నారు.
జొమాటో: బ్లాక్ డీల్ ద్వారా జొమాటోలోని తన వాటాల్లో 3 శాతం విక్రయించేందుకు అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అలీబాబాకు 13.3 శాతం వాటాలున్నాయి.
ఎస్బీఐ: 2022-23లో పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో మౌలిక బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.10000 కోట్లు సమీకరించడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎస్బీఐ ప్రకటించింది.
బ్రిటానియా: ఫ్రాన్స్కు చెందిన చీజ్ మేకర్ బెల్ ఎస్ఏతో బ్రిటానియా ఇండస్ట్రీస్ సంయుక్త భాగస్వామ్యం కుదుర్చుకొంది. ఇందులో భాగంగా భారత్ సహా మరికొన్ని మార్కెట్లకు చీజ్ ఉత్పత్తులను తయారు చేసి బ్రిటానియా విక్రయించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..