
Stock Market Update: ఆద్యంతం లాభాల జోరు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే జోరులో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పరిణామాలు సూచీలకు కలిసొచ్చాయి. గురువారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సానుకూలంగా కదలాడాయి. ప్రస్తుతం ఐరోపా మార్కెట్లు, యూఎస్ ఫ్యూచర్స్ సైతం లాభాల్లో పయనిస్తున్నాయి. మరోవైపు డాలర్ ఇండెక్స్ ఇటీవల గరిష్ఠాలతో పోలిస్తే భారీగా కుంగింది. ఇది మార్కెట్లలో ఉత్సాహం నింపింది. మరోవైపు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో భారత వృద్ధిపై సానుకూల ప్రకటనలు చేయడం కూడా సూచీల సెంటిమెంటును పెంచింది.
ఉదయం సెన్సెక్స్ 54,671.50 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,936.63 - 54,449.34 మధ్య కదలాడింది. చివరకు 632.13 పాయింట్ల లాభంతో 54,884.66 వద్ద ముగిసింది. 16,296.60 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 182.30 పాయింట్లు లాభపడి 16,352.45 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,370.60 - 16,221.95 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.57 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, ఎల్అండ్టీ, హెచ్యూఎల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎంఅండ్ఎం షేర్లు లాభాల్లో పయనించాయి. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్లోని మరిన్ని సంగతులు..
* పారాదీప్ పాస్ఫేట్స్ షేర్లు ఈరోజు తొలిసారి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.42తో పోలిస్తే 5 శాతం ప్రీమియం వద్ద లిస్టయ్యాయి. ఇంట్రాడేలో 47.25 వద్ద గరిష్ఠాన్ని తాకాయి. చివరకు రూ.43.90 వద్ద స్థిరపడ్డాయి.
* మార్చితో ముగిసిన త్రైమాసికంలో గెయిల్ ఇండియా ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో కంపెనీ షేర్లు ఈరోజు 5 శాతానికి పైగా నష్టపోయాయి.
* అడ్రస్ వెరిఫికేషన్, లోకేషన్ మ్యాపింగ్ నిమిత్తం ‘డెలివరీ’ అభివృద్ధి చేసిన ప్రత్యేక సాంకేతికతకు అమెరికాలో పేటెంట్ లభించింది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 8 శాతానికి పైగా లాభపడ్డాయి.
* భవిష్యత్తు వృద్ధి అంచనాలపై ఎస్జేఎస్ చేసిన సానుకూల ప్రకటనలతో కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 12 శాతం మేర ర్యాలీ అయ్యాయి.
* ఇండియా సిమెంట్స్ గత ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.10.6 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం సైతం 4 శాతం కుంగింది. దీంతో ఇండియా సిమెంట్స్ షేర్లు 4 శాతం నష్టపోయాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Bumrah : బుమ్రాకు టెస్టు క్రికెట్ చాలా తేలికగా అనిపిస్తోంది : అజిత్ అగార్కర్
-
General News
Hyderabad News: ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
India News
India Corona: దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
-
World News
Israel: హెజ్బొల్లా డ్రోన్లను కూల్చిన ఇజ్రాయెల్..!
-
Sports News
Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
-
Business News
Crypto crash: క్రిప్టో క్రాష్.. ఇంకా ఎంత దూరం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Samantha: కరణ్.. అన్హ్యాపీ మ్యారేజ్కి మీరే కారణం: సమంత