Stock market: ఆగని దూకుడు.. ఆల్టైమ్ గరిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో గతవారం లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ వారాన్ని అదే దూకుడుతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం, ప్రధాన కంపెనీల షేర్లు రాణించడంతో సోమవారం నాటి ట్రేడింగ్లో సూచీల పరుగు కొనసాగింది.
ముంబయి: అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో గతవారం లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ వారాన్ని అదే దూకుడుతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం, ప్రధాన కంపెనీల షేర్లు రాణించడంతో సోమవారం నాటి ట్రేడింగ్లో సూచీల పరుగు కొనసాగింది. దీంతో సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు మేర లాభపడగా.. నిఫ్టీ 18,550 ఎగువన ముగిసింది. చివర్లో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపారు. డాలరుతో రూపాయి మారకం విలువ 81.66గా ఉంది.
చైనాలో జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల కారణంగా ఆసియా షేర్లు ఈ ఉదయం స్తబ్ధుగా ప్రారంభమయ్యాయి. దీంతో మన సూచీలు సైతం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. కాసేపటికే కోలుకున్నాయి. చైనాను కొవిడ్ పట్టిపీడిస్తున్న వేళ ఆ దేశ చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు క్షీణించాయి. బ్యారెల్ క్రూడాయిల్ 2 డాలర్ల మేర క్షీణించడంతో మన సూచీలకు కలిసొచ్చే అంశంగా మారింది. దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే మన దేశానికి ఇది ప్రయోజనం కలిగించే అంశంగా మారడంతో దేశీయ మార్కెట్లపై మదుపరుల్లో సానుకూలత ఏర్పడింది. అంతర్జాతీయంగా బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 3.11 శాతం క్షీణించి 81.03 వద్ద ట్రేడవుతోంది.
ఉదయం 62,077 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఓ దశలో 62,701.40 వద్ద ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకింది. చివరికి 211.16 పాయింట్ల లాభంతో 62,504.80 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 50 పాయింట్ల లాభంతో 18,562.75 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో రిలయన్స్ (3.48 శాతం), నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. మొత్తం 2024 షేర్లు లాభపడగా.. 1458 షేర్లు క్షీణించాయి. 185 షేర్లలో ఎలాంటి మార్పూ లేదు. మెటల్ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. పెట్రోలియం, పెయింట్స్ షేర్లు లాభపడ్డాయి.
- డిసెంబర్ 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించడంతో బీఎస్ఈలో ఆ కంపెనీ షేరు 2.38 శాతం లాభపడి రూ.2,771.50 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
టెలికాం మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. వీఐ 2.0 ప్రస్థానం ప్రారంభం కాబోతోందన్నారు. -
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది. -
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం