Stock Market Update: మార్కెట్లను కలవరపెట్టిన ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనాలు!
ఆర్బీఐ రేట్ల పెంపు సంకేతాలతో ఉదయం స్తబ్దుగా ప్రారంభమైన మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి....
ముంబయి: ఆర్బీఐ రేట్ల పెంపు సంకేతాలతో ఉదయం స్తబ్ధుగా ప్రారంభమైన మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. దీంతో సూచీలు వరుసగా నాలుగో రోజైన బుధవారమూ నష్టాలను నమోదు చేశాయి. రెపోరేటు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటన వెలువడిన వెంటనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. కానీ, పెంపు ఊహించిన స్థాయిలోనే ఉండడంతో మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో కాపేపటికే మార్కెట్లు లాభాల్లోకి ఎగబాకాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కూడా అందుకు దోహదం చేశాయి. అయితే, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆర్బీఐ అంచనాలు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దారితీశాయి. దీంతో ఒంటిగంట తర్వాత సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకొని ఇక కోలుకోలేకపోయాయి. మరోవైపు వృద్ధిరేటు అంచనాలను తగ్గించడం కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది.
ఉదయం సెన్సెక్స్ 55,345.51 వద్ద స్తబ్ధుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,683.30 - 55,423.97 మధ్య కదలాడింది. చివరకు 214.85 పాయింట్ల నష్టంతో 54,892.49 వద్ద ముగిసింది. 16,474.95 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 60.10 పాయింట్లు నష్టపోయి 16,356.25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,293.35 - 16,514.30 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.74 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, టైటన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM