Sensex@60K: 60 వేలు దాటిన సెన్సెక్స్.. రెండు నెలల్లో ఎంత మార్పో!
Sensex@60K: సరిగ్గా రెండు నెలలు తిరిగే సరికి మళ్లీ సెన్సెక్స్ పుంజుకుంది. 60వేల మార్కును అందుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: జూన్ 17.. సరిగ్గా రెండు నెలల క్రితం. 40 ఏళ్ల గరిష్ఠానికి అమెరికా ద్రవ్యోల్బణం చేరడం.. వడ్డీ రేట్ల పెంపు భయాలు.. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు.. వెరసి మన మార్కెట్లు కుదేలయ్యాయి. కొవిడ్ తర్వాత భారీగా పుంజుకుని 60 వేల మార్కు దాటిన సెన్సెక్స్కు నష్టాలు పోటెత్తాయి. దీంతో జూన్ 17న 50,921 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్ 52 వారాల కనిష్ఠానికి చేరింది. సరిగ్గా రెండు నెలలు తిరిగే సరికి మళ్లీ సెన్సెక్స్ పుంజుకుంది. ఆగస్టు 17న మళ్లీ 60 వేల మార్కును అందుకుంది. ఈ రెండు నెలల్లో ఇంతకీ ఏం మారింది?
దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా వరుస లాభాలు ఆర్జిస్తున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్లోనూ అదే పునరావృతమైంది. ఆసియా మార్కెట్లతో పాటు సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బుధవారం 60వేల మార్కును అందుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 417.92 పాయింట్ల లాభంతో 60,260.13 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 119 పాయింట్లు లాభపడి 17,944.25 వద్ద స్థిరపడింది.
తగ్గిన ద్రవ్యోల్బణ భయాలు
అటు అమెరికాతో పాటు, దేశీయంగా ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్లను వణికించాయి. దీంతో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. అటు రిటైల్ ద్రవ్యోల్బణంతో పాటు, టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. మరోవైపు అమెరికాలోనూ ద్రవ్యోల్బణం కాస్త అదుపులోకి రావడంతో వడ్డీ రేట్ల పెంపు విషయంలో సెంట్రల్ బ్యాంకులు మునుపటి దూకుడును కనబరచకపోవచ్చన్నది అంచనా. ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
విదేశీ మదుపరులు తిరిగొచ్చారు
ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్ల పతనానికి మరో కారణం విదేశీ సంస్థాగత మదుపరులు (FPI) మన మార్కెట్లను వీడడం. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన సంపదను మన మార్కెట్ల నుంచి వారు తరలించారు. అయితే, విదేశీ మదుపరులు మళ్లీ మన మార్కెట్లవైపు చూస్తుండడం మార్కెట్ల ర్యాలీకి దోహదం చేస్తోంది. జులైలో రూ.5 వేల కోట్ల ఎఫ్పీఐలు మన మార్కెట్లలోకి రాగా.. ఒక్క ఆగస్టు నెలలో ఇప్పటి వరకు రూ.23,800 కోట్లు ఎఫ్ఐపీలు వచ్చాయి. దీనికి రిటైల్ సంస్థాగత మదుపరులు తోడవ్వడం 60వేల మార్కును చేరుకోవడానికి దోహదం చేశాయి.
ఈ షేర్లు రాణించాయి..
ఈ రెండు నెలల కాలంలో సెన్సెక్స్ 30 షేర్లలో 13 షేర్లు భారీగా రాణించాయి. దాదాపు 20 నుంచి 35 శాతం మేర పెరిగాయి. వీటిలో అత్యధికంగా ఏషియన్ పెయింట్స్ బాగా రాణించింది. రెండు నెలల క్రితం ఈ షేరు విలువ రూ.2,583 ఉండగా.. నేడు రూ.3,500 స్థాయికి చేరింది. అంటే దాదాపు 35 శాతం పెరిగింది. బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు సైతం అదే స్థాయిలో రాణించాయి. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు 25 నుంచి 29 శాతం మేర లాభపడగా.. టాటా స్టీల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ షేర్లు సైతం 20 నుంచి 25 శాతం మేర రాణించాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు తగ్గుతున్న నేపథ్యంలో మార్కెట్ల ర్యాలీ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు