Aadhaar: ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
అవసరం లేని దగ్గర మాస్క్డ్ ఆధార్ కార్డుని ఇవ్వాలని కేంద్రం కోరింది...
ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డు అవసరం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడపడితే అక్కడ దీని ఫొటోకాపీ (జిరాక్స్)ని ప్రూఫ్గా ఇచ్చేస్తున్నాం. వాటిని వారు ఎలా ఉపయోగిస్తారో కూడా ఆరా తీయడం లేదు. పని అయిపోయాక తిరిగి తీసుకుందామన్న అవగాహనా చాలా మందిలో ఉండడం లేదు. దీంతో ఆధార్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్, సిమ్.. ఇలా ప్రతిదానికీ మనం ఇప్పటికే ఆధార్ను అనుసంధానించి ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆధార్ వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే ముప్పు తప్పదు.
దీనిపై ప్రభుత్వం తాజాగా పౌరులను అప్రమత్తం చేసింది. అవసరమైన చోట మాత్రమే పూర్తి ఆధార్ నెంబరు ఉన్న కార్డు ఫొటోకాపీని ఇవ్వాలని సూచించింది. అవసరం లేని దగ్గర మాస్క్డ్ ఆధార్ కార్డుని ఇవ్వాలని కోరింది. హోటల్స్, సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్కార్డు జిరాక్స్ను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించి ఉండే ఆధార్ పత్రమే ఈ మాస్క్డ్ ఆధార్. దీనిపై మీ ఫొటో, క్యూఆర్ కోడ్, మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. ఆధార్ నంబర్ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు.
మాస్క్డ్ ఆధార్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి...
> UIDAI అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ‘డౌన్లోడ్ ఆధార్’ ఆప్షన్ను ఎంచుకోవాలి.
> ఆధార్ నంబర్/ఎన్రోల్మెంట్ ఐడీ/ వర్చువల్ ఐడీ నంబర్ను ఎంటర్ చేయాలి.
> ఆధార్ను డౌన్లోడ్ చేసుకునేముందు అక్కడ ఉన్న ‘మాస్క్డ్ ఆధార్’ టిక్బాక్స్ను ఓకే చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
> ఆ తర్వాత ‘సెండ్ ఓటీపీ’ బటన్పై క్లిక్ చేయాలి. ఆధార్తో జత చేసిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత డౌన్లోడ్పై క్లిక్ చేయాలి.
> ఆ తర్వాత మీకు పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్లోడ్ అవుతుంది. దీనికి పాస్వర్డ్ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్ ద్వారా వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్