Sharechat: షేర్చాట్లో ఉద్యోగాల కోత.. 600 మందికి ఉద్వాసన!
Sharechat lay-offs: షేర్చాట్ 600 మంది ఉద్యోగుల్ని తొలగించింది. గతంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న ఆ కంపెనీ.. ఇప్పుడు తొలగింపు ప్రక్రియను చేపట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సోషల్ షేరింగ్ యాప్ షేర్చాట్ (Sharechat) మాతృ సంస్థ మొహల్లా టెక్ భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన (Lay offs) పలికింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు 600 మందిని తొలగించింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 2,100 మంది పనిచేస్తుండగా.. అందులో 20 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించింది. గతంలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకున్న నేపథ్యంలో ఇప్పుడు అధికంగా ఉన్న వారిని తొలగించిట్లు తెలిసింది.
తొలగింపు విషయాన్ని ఆ కంపెనీ ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ప్రభావితం కాని ఉద్యోగులకు సైతం సమాచారం చేరవేసింది. తొలగించిన ఉద్యోగులకు 2022 డిసెంబర్ వరకు నూరు శాతం వేరియబుల్ పేని చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే నోటీసు పీరియడ్ ఉన్న కాలానికి పూర్తి వేతనం చెల్లించనున్నారు. పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాలా చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నారు. 2023 జూన్ వరకు ఆరోగ్య బీమా సదుపాయం కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. వాడుకోని సెలవులను గరిష్ఠంగా 45 రోజుల వరకు ఎన్క్యాష్ చేసుకోవచ్చు.
ఐఐటీ పూర్వ విద్యార్థులైన సత్యదేవ, ఫరీద్ అషన్, భాను సింగ్ కలిసి 2015లో షేర్చాట్ యాప్ను ప్రారంభించారు. ప్రాంతీయ భాషలో కంటెంట్ను అందించడంతో అనతి కాలంలోనే ఈ యాప్ ప్రజాదరణ పొందింది. టిక్టాక్ బ్యాన్ తర్వాత ఇదే కంపెనీ మోజ్ పేరిట ఓ వీడియో షేరింగ్ యాప్ను సైతం తీసుకొచ్చింది. వీడియో షేరింగ్, సోషల్ మీడియా విభాగంలో మరింత విస్తరిస్తున్న ఈ కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. దీంతో షేర్చాట్ మాతృ సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకుంది. ఫండింగ్ నెమ్మదించడంతో ఇప్పుడు అధికంగా ఉన్న ఉద్యోగుల్ని తొలగించే ప్రక్రియ చేపట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత డిసెంబర్లో సైతం ఇదే కంపెనీ జీత్ 11 ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ను మూసేసింది. అందులో 115 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. నెల రోజులు తిరగకముందే షేర్ చాట్లో 20 శాతం మందిని తొలగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి