Signature Bank: అమెరికాలో మరో బ్యాంకు మూసివేత
Signature Bank: క్రిప్టో డిపాజిట్లు అధికంగా ఉన్న న్యూయార్క్ సిగ్నేచర్ బ్యాంక్ను మూసివేస్తున్నట్లు అమెరికా నియంత్రణ సంస్థలు ఆదివారం ప్రకటించాయి.
వాషింగ్టన్: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) ఉదంతం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తుండగానే.. అమెరికాలో మరో బ్యాంక్ మూతపడింది. క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్ బ్యాంక్ (Signature Bank)ను మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఇలా కీలక బ్యాంకులు మూతపడడంతో బ్యాంకింగ్ రంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
సిగ్నేచర్ బ్యాంకును ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్డీఐసీ)’ తన నియంత్రణలోకి తీసుకుంది. సిగ్నేచర్కు గత ఏడాది ముగిసే నాటికి 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుందని ఎఫ్డీఐసీ పేర్కొంది. అందుకోసం తాత్కాలికంగా ఓ ‘బ్రిడ్జ్ బ్యాంక్’ను ఏర్పాటు చేశామని తెలిపింది. దీని ద్వారా సిగ్నేచర్ కస్టమర్లు, డిపాజిటర్లు తమ నిధులకు యాక్సెస్ పొందొచ్చని పేర్కొంది. ఈ తాత్కాలిక బ్యాంకుకు గ్రెగ్ కార్మికేల్ అనే బ్యాంకింగ్ నిపుణుడిని సీఈఓగా నియమించింది.
సిగ్నేచర్ బ్యాంక్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వాణిజ్య బ్యాంకు. స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ బ్యాంకింగ్ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు సేవలందిస్తోంది. గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే. అయితే, తమ క్రిప్టో ఆధారిత డిపాజిట్లను త్వరలోనే 8 బిలియన్ డాలర్లకు కుదించుకుంటామని డిసెంబరులో బ్యాంకు ప్రకటించింది. మరోవైపు తమ సీఈఓ జోసెఫ్ డీపావోలో సీనియర్ సలహాదారుగా మారనున్నారని ఫిబ్రవరిలోనే తెలిపింది. ఆయన స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎరిక్ హొవెల్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. బ్యాంకు ప్రారంభమైన 2001 నుంచి డీపావోలో సీఈఓ, అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : బైడెన్
ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి కారణమైన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అలాగే డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థను రక్షించేలా నియంత్రణ సంస్థలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయని.. అందుకు తాను హర్షిస్తున్నానని తెలిపారు.
మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికే సిగ్నేచర్ బ్యాంకుపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది. మరోవైపు బ్యాంకులు ద్రవ్యలభ్యత సమస్యలు ఎదుర్కోకుండా 25 మిలియన్ డాలర్లతో తాత్కాలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడ్ ప్రకటించింది. అలాగే సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో డిపాజిట్దారులు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు సోమవారం నుంచి అనుమతి ఉంటుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
క్రూడాయిల్ దిగుమతుల బిల్లు తగ్గింది, కానీ..!
దేశీయ ముడి చమురుల దిగుమతుల బిల్లు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 16 శాతం మేర తగ్గింది. -
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఎన్పీసీఐ సిద్ధమైంది. -
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా
EPF Withdraw: నగదు ఉపసంహరణలో ఈపీఎఫ్వో కీలక మార్పు చేసింది. ఇకపై చందాదారులు వైద్య చికిత్స కోసం రూ.లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చు. -
మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?
Steve Jobs: యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ గురించి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షిల్లర్ ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
డెమోగ్రఫిక్ డివిడెండ్ కారణంగా రావాల్సిన ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. -
మా రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్ నిర్ణయం: అమెరికా
USA-India: డబ్ల్యూటీఓ వివాదాల పరిష్కారం తర్వాత కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గించినట్లు అగ్రరాజ్యం తెలిపింది. -
అంతర్జాతీయ మార్గాల్లో జాగ్రత్త
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, నష్టభయాలను సొంతంగా మదింపు చేసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని దేశీయ విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. -
2024లో వృద్ధి రేటు 6.8%
ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పెంచింది. -
రూ.లక్ష కోట్లకు పైగా ఐఫోన్ ఎగుమతులు
మన దేశం నుంచి యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో 6.27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.52000 కోట్ల) విలువైన ఐఫోన్లు ఎగుమతి కాగా, 2023-24లో ఈ మొత్తం రెట్టింపై 12.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,00,430 కోట్ల) విలువైనవి ఎగుమతి అయ్యాయి. -
ఈ కంపెనీల్లో పనిచేయడం ఇష్టం
మన దేశంలో పనిచేయడానికి అనువైన కంపెనీల్లో అగ్రస్థానాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) దక్కించుకుంది. -
3 రోజుల్లో రూ.7.93 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఐటీ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మూడో రోజూ సూచీలు నష్టపోయాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగానే ఉన్నాయి. -
ఫండ్లలోకి 35% పెరిగిన పెట్టుబడులు
ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా రాణించడానికి తోడు చిన్న మదుపరుల భాగస్వామ్యం అధికంగా ఉండడంతో.. మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ గత ఆర్థిక సంవత్సరం రూ.14 లక్షల కోట్లు పెరిగి (35% వృద్ధి) రూ.53.40 లక్షల కోట్లకు చేరింది. -
‘ఎక్స్’ నూతన వినియోగదార్లు పోస్ట్, లైక్కు రుసుము చెల్లించాలి
ఎక్స్ (గతంలో ట్విటర్) ఫ్లాట్ఫామ్పై కొత్తగా నమోదయ్యే వినియోగదార్లు ఇకపై లైక్, పోస్ట్, బుక్మార్క్, రిప్లయ్ కోసం తక్కువ మొత్తంలో వార్షిక రుసుము చెల్లించాల్సి రావొచ్చని కంపెనీ తెలిపింది. -
పెద్ద ఆర్డర్ల డెలివరీకి జొమాటో ప్రత్యేక వాహనం
50 మంది వరకు స్నేహితులు/ కుటుంబ సభ్యులు/ సహోద్యోగులతో జరుపుకునే వేడుకలు, ఫంక్షన్లు, కార్యక్రమాల కోసం ఆహార పదార్థాలను డెలివరీ చేస్తామని జొమాటో తెలిపింది. -
రెండేళ్లలో రూ.1000 కోట్ల విక్రయాలు!
ఆధునిక సాంకేతికతతో పరుపులను తయారు చేస్తున్న ద స్లీప్ కంపెనీ, రానున్న రెండేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. -
రైతులకు నేరుగా రుణాలు ఇవ్వం: నాబార్డ్
తాము రైతులకు నేరుగా రుణాలు అందించబోమని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) మంగళవారం స్పష్టం చేసింది. -
‘కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ’కి భారత పేటెంట్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కీపాయింట్ టెక్నాలజీస్ ఆవిష్కరించిన ‘కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ’కి ఇండియా పేటెంట్ ఆఫీస్ (ఐపీఓ) పేటెంట్ మంజూరు చేసింది. -
ఫ్లిప్కార్ట్ వేసవి విక్రయాలు నేటి నుంచి
ఫ్లిప్కార్ట్ వార్షిక వేసవి విక్రయాలు ఈనెల 17న ప్రారంభమై 23 వరకు కొనసాగనున్నాయి. ఈ విక్రయాల్లో ఏసీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు లాంటి గృహోపకరణాలను ఆకర్షణీయ ధరల్లో వినియోగదార్లు పొందొచ్చని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్