Silicon Valley Bank: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కలకలం
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అందరికీ సుపరిచితమే. అయితే అక్కడి ‘సిలికాన్ వ్యాలీ బ్యాంక్’ (ఎస్వీబీ) మాత్రం ఇటీవలి దాకా ఆ ప్రాంతం వెలుపల అత్యధికులకు తెలియదు.
మూసివేత, ఆస్తుల జప్తు
ఆందోళనలో ప్రపంచవ్యాప్త బ్యాంకులు, అంకురాలు
2008 తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యం ఇదే
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అందరికీ సుపరిచితమే. అయితే అక్కడి ‘సిలికాన్ వ్యాలీ బ్యాంక్’ (ఎస్వీబీ) మాత్రం ఇటీవలి దాకా ఆ ప్రాంతం వెలుపల అత్యధికులకు తెలియదు. గురువారం అమెరికా మార్కెట్లో అంకుర పరిశ్రమ షేర్లు రక్తమోడడానికి కారణం ఈ బ్యాంకే. అంతే కాదు.. అంకుర సంస్థలు, టెక్ వర్గాల్లో ఇది తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. శుక్రవారం ఏకంగా ఈ బ్యాంక్ను నియంత్రణ సంస్థలు మూసివేయడంతో పాటు ఆస్తులను జప్తు చేయడంతో ఈ బ్యాంకు మాతృ సంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు దాదాపు 60 శాతం కుంగడం గమనార్హం.
ఇంతకీ ఏం జరిగిందంటే..: శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థే సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ ఇది. టెక్ ఆధారిత వెంచర్ క్యాపిటల్ ఫండ్లకు నిధులు అందించడం దీని ప్రత్యేకత. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించినట్లు.. 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇక్కడి నుంచే బ్యాంకు వైఫల్య పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. నికర వడ్డీ ఆదాయాల్లో భారీ క్షీణత నమోదు కావచ్చని ఎస్వీబీ పేర్కొనడంతో అగ్నికి ఆజ్యం పోసింది.
ఎస్వీబీ ప్రకటన రావడం ఆలస్యం.. బ్యాంకు డిపాజిట్లలో అధిక మొత్తం ఉపసంహరణకు గురయ్యాయి. దీంతో పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని, డబ్బును ఉపసంహరించుకోవాలని పలువురు వెంచర్ క్యాపిటలిస్టులు తమ పోర్ట్ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. వేరొక బ్యాంకుకు నగదు బదిలీ చేయమని మరికొన్ని వీసీ సంస్థలు, పోర్ట్ఫోలియో కంపెనీలకు తెలిపాయి. కొన్ని మాత్రమే ఎస్వీబీకి అండగా నిలబడ్డాయి. ఈ సమస్యలకు తోడు సిల్వర్గేట్ క్యాపిటల్ కార్ప్ మూసివేతా సంభవించడంతో, బ్యాంకింగ్ షేర్లను కిందకు లాగాయి. ఈ పరిణామల మధ్య ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ బ్యాంకు ఆస్తులను జప్తు చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది.
35 ఏళ్లలోనే అతిపెద్ద పతనం: మాతృసంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు 35 ఏళ్లలోనే అత్యంత అధ్వానంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60% క్షీణించడంతో 80 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. వెంచర్ క్యాపిటలిస్టులకు సర్దిచెప్పడానికి బ్యాంకు ప్రయత్నం చేసింది. అయితే శుక్రవారం పరిణామంతో ట్రేడింగ్ మొదలవడానికి ముందే ఈ షేర్లలో ట్రేడింగ్ను నిలిపేశారు. గత సెప్టెంబరులో 406 డాలర్ల వద్ద ఉన్న ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు, ప్రస్తుతం 106 డాలర్లకు పతనమైంది. గత 5 రోజుల్లోనే షేరు విలువ 178 డాలర్లకు పైగా క్షీణించింది.
అంకురాలకు.. ఈ బ్యాంకుకు సంబంధం ఏమిటి?: అమెరికా అంకురాలకు ఎస్వీబీకి విడదీయలేని సంబంధం ఉంది. సిలికాన్ వ్యాలీ, టెక్ అంకురాలకు ఈ బ్యాంకే ఆర్థిక సహాయం చేస్తోంది. అమెరికాలోని సగం వెంచర్ క్యాపిటల్ మద్దతున్న అంకురాలతో ఇది వ్యాపారం చేస్తోంది. అంతే కాదు.. అమెరికాలో 44 శాతం టెక్, ఆరోగ్య సంరక్షణ కంపెనీలకూ ఇదే ఆధారం. అందుకే అంకుర, టెక్ పరిశ్రమల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
* సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది ఎక్కువ టెక్ పరిశ్రమకే రుణాలిచ్చినందున.. ఈ పరిణామం ఇతర బ్యాంకులపై చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!