Silicon Valley Bank: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కలకలం
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అందరికీ సుపరిచితమే. అయితే అక్కడి ‘సిలికాన్ వ్యాలీ బ్యాంక్’ (ఎస్వీబీ) మాత్రం ఇటీవలి దాకా ఆ ప్రాంతం వెలుపల అత్యధికులకు తెలియదు.
మూసివేత, ఆస్తుల జప్తు
ఆందోళనలో ప్రపంచవ్యాప్త బ్యాంకులు, అంకురాలు
2008 తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యం ఇదే
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అందరికీ సుపరిచితమే. అయితే అక్కడి ‘సిలికాన్ వ్యాలీ బ్యాంక్’ (ఎస్వీబీ) మాత్రం ఇటీవలి దాకా ఆ ప్రాంతం వెలుపల అత్యధికులకు తెలియదు. గురువారం అమెరికా మార్కెట్లో అంకుర పరిశ్రమ షేర్లు రక్తమోడడానికి కారణం ఈ బ్యాంకే. అంతే కాదు.. అంకుర సంస్థలు, టెక్ వర్గాల్లో ఇది తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. శుక్రవారం ఏకంగా ఈ బ్యాంక్ను నియంత్రణ సంస్థలు మూసివేయడంతో పాటు ఆస్తులను జప్తు చేయడంతో ఈ బ్యాంకు మాతృ సంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు దాదాపు 60 శాతం కుంగడం గమనార్హం.
ఇంతకీ ఏం జరిగిందంటే..: శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థే సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ ఇది. టెక్ ఆధారిత వెంచర్ క్యాపిటల్ ఫండ్లకు నిధులు అందించడం దీని ప్రత్యేకత. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించినట్లు.. 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇక్కడి నుంచే బ్యాంకు వైఫల్య పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. నికర వడ్డీ ఆదాయాల్లో భారీ క్షీణత నమోదు కావచ్చని ఎస్వీబీ పేర్కొనడంతో అగ్నికి ఆజ్యం పోసింది.
ఎస్వీబీ ప్రకటన రావడం ఆలస్యం.. బ్యాంకు డిపాజిట్లలో అధిక మొత్తం ఉపసంహరణకు గురయ్యాయి. దీంతో పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని, డబ్బును ఉపసంహరించుకోవాలని పలువురు వెంచర్ క్యాపిటలిస్టులు తమ పోర్ట్ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. వేరొక బ్యాంకుకు నగదు బదిలీ చేయమని మరికొన్ని వీసీ సంస్థలు, పోర్ట్ఫోలియో కంపెనీలకు తెలిపాయి. కొన్ని మాత్రమే ఎస్వీబీకి అండగా నిలబడ్డాయి. ఈ సమస్యలకు తోడు సిల్వర్గేట్ క్యాపిటల్ కార్ప్ మూసివేతా సంభవించడంతో, బ్యాంకింగ్ షేర్లను కిందకు లాగాయి. ఈ పరిణామల మధ్య ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ బ్యాంకు ఆస్తులను జప్తు చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది.
35 ఏళ్లలోనే అతిపెద్ద పతనం: మాతృసంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు 35 ఏళ్లలోనే అత్యంత అధ్వానంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60% క్షీణించడంతో 80 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. వెంచర్ క్యాపిటలిస్టులకు సర్దిచెప్పడానికి బ్యాంకు ప్రయత్నం చేసింది. అయితే శుక్రవారం పరిణామంతో ట్రేడింగ్ మొదలవడానికి ముందే ఈ షేర్లలో ట్రేడింగ్ను నిలిపేశారు. గత సెప్టెంబరులో 406 డాలర్ల వద్ద ఉన్న ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు, ప్రస్తుతం 106 డాలర్లకు పతనమైంది. గత 5 రోజుల్లోనే షేరు విలువ 178 డాలర్లకు పైగా క్షీణించింది.
అంకురాలకు.. ఈ బ్యాంకుకు సంబంధం ఏమిటి?: అమెరికా అంకురాలకు ఎస్వీబీకి విడదీయలేని సంబంధం ఉంది. సిలికాన్ వ్యాలీ, టెక్ అంకురాలకు ఈ బ్యాంకే ఆర్థిక సహాయం చేస్తోంది. అమెరికాలోని సగం వెంచర్ క్యాపిటల్ మద్దతున్న అంకురాలతో ఇది వ్యాపారం చేస్తోంది. అంతే కాదు.. అమెరికాలో 44 శాతం టెక్, ఆరోగ్య సంరక్షణ కంపెనీలకూ ఇదే ఆధారం. అందుకే అంకుర, టెక్ పరిశ్రమల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
* సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది ఎక్కువ టెక్ పరిశ్రమకే రుణాలిచ్చినందున.. ఈ పరిణామం ఇతర బ్యాంకులపై చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. -
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది. -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!