Simple ONE EV: సింపుల్ వన్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212km
Simple ONE electric scooter: విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ తమ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Simple ONE electric scooter)ను భారత్లో విడుదల చేసింది. దీని ధర, ఫీచర్లు, బ్యాటరీ రేంజ్ వంటి వివరాలు తెలుసుకుందాం..!
ఇంటర్నెట్ డెస్క్: గతకొంత కాలంగా విద్యుత్ వాహన ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Simple ONE electric scooter)’ ఎట్టకేలకు మంగళవారం విడుదలైంది. ఈ స్కూటర్ను సింపుల్ ఎనర్జీ 2021 ఆగస్టులోనే ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్తో వాహన ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. అయితే, కస్టమర్లకు మెరుగైన అనుభూతిని, సురక్షితమైన డ్రైవింగ్ ఎక్స్పీరియెన్స్ను ఇవ్వడం కోసం సుదీర్ఘంగా టెస్ట్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది.
సింపుల్ వన్ (Simple ONE electric scooter) ‘రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’పై చాలా సమయం, డబ్బు వెచ్చించినట్లు సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్కుమార్ తెలిపారు. సుదీర్ఘ దూరం, అత్యంత స్మార్ట్, ఫాస్ట్ టెక్నాలజీ, డ్యుయల్ బ్యాటరీ ఈ స్కూటర్ ప్రత్యేకతలని వెల్లడించారు. IP67 రేటింగ్తో కూడిన 5kWh లిథియం ఐయాన్ డ్యుయల్ బ్యాటరీ ప్యాక్ను ఇస్తున్నట్లు తెలిపారు. 95 శాతం పరికరాలను దేశీయంగానే సమకూర్చుకున్నట్లు వెల్లడించారు.
సింపుల్ వన్ (Simple ONE electric scooter)లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో 7 అంగుళాల డిజిటల్ డిస్ప్లేను ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీ రేంజ్ వివరాలు, కాల్ అలర్ట్ వంటి వివరాలు తెరపై కనిపిస్తాయని వెల్లడించింది. ఒక్క నిమిషంలోనే 1.5 కి.మీ ప్రయాణించేందుకు కావాల్సిన ఛార్జింగ్ పూర్తవుతుందని తెలిపింది. అలా ఇంట్లో 5 గంటల 54 నిమిషాల్లో 0- 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుందని పేర్కొంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 212 కి.మీ వరకు ప్రయాణిస్తుందని తెలిపింది. 2.77 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుందని వెల్లడించింది. మొత్తం ఆరు రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.
సింపుల్ వన్ స్కూటర్ (Simple ONE electric scooter) ధర రూ.1.45 లక్షల (ఎక్స్షోరూం, బెంగళూరు) నుంచి ప్రారంభమవుతుంది. 750 వాట్ పోర్టబుల్ ఛార్జర్కు అదనంగా రూ.13,000 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత బెంగళూరులో జూన్ 6 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. తర్వాత మిగతా నగరాల్లో ఈ స్కూటర్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి.