OYO offer: ఓయోలో రూమ్స్పై 60 శాతం వరకు డిస్కౌంట్.. కేవలం వారికి మాత్రమే!
OYO Rooms: ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ కొత్త ఆఫర్తో ముందుకొచ్చింది. తమ హోటళ్లలో బస చేసే చిరు వ్యాపారులకు 60 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది.
దిల్లీ: ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ (OYO Rooms) కొత్త ఆఫర్తో ముందుకొచ్చింది. తమ హోటళ్లలో చిరు వ్యాపారులకు 60 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 27న ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్న, మధ్యతరగతి వ్యాపారుల కోసం ఈ పరిమిత కాలపు స్కీమ్ తీసుకొచ్చినట్లు ఓయో ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 27 నుంచి జులై 3 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
ఓయో కస్టమర్లలో ఎక్కువ మంది చిన్న, మధ్యతరగతి వ్యాపారానికి సంబంధించిన యజమానులు, ఉద్యోగులే ఉంటున్నారని ఓయో తెలిపింది. అందుకే ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారిని మరింత ప్రోత్సహించడంతో పాటు గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ను ప్రకటించినట్లు పేర్కొంది. ఆ ఆఫర్ సమయంలో దేశవ్యాప్తంగా 2 వేల ఓయో ప్రాపర్టీల్లో అందుబాటులో ఉన్న 10వేల గదులను బుక్ డిస్కౌంట్లో బుక్ చేసుకోవచ్చని ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ తెలిపారు. ఓయో యాప్, వెబ్సైట్, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫాంల ద్వారా ఈ ఆఫర్ను పొందొచ్చని పేర్కొన్నారు. చెక్-ఇన్ సమయంలో తమ బిజినెస్ కార్డును చూపించాల్సి ఉంటుందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు