Fixed Deposit: పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ కంటే చిన్న చిన్న ఎఫ్డీలే మేలు! ఎలాగంటే?
Fixed Deposit: చాలా మంది తమ దగ్గర ఉన్న మొత్తాన్ని ఒకే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. కానీ, అలా కాకుండా దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి పలు ఎఫ్డీలు చేస్తే ప్రయోజాలు ఎక్కువని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇన్వెస్ట్మెంట్ అనగానే భారతీయులకు మొదట ఫిక్స్డ్ డిపాజిటే (Fixed Deposit) గుర్తొస్తుంది. భద్రత, కచ్చితమైన రాబడే అందుకు కారణం. అయితే, చాలా మంది ఒకే బ్యాంకులో పెద్ద మొత్తంలో ఎఫ్డీ (Fixed Deposit) చేస్తే ఎలాంటి సమస్యా ఉండదనుకుంటారు. కానీ, అది అంత ప్రయోజనకరమైన మార్గం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి.. పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ప్రయోజనాలు ఎక్కువని చెబుతుంటారు. ఎందుకో చూద్దాం..!
డైవర్సిఫికేషన్..
ఉదాహరణకు మీ దగ్గర రూ.25 లక్షలు ఉన్నాయనుకుందాం. దాన్ని ఒకే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చేయడం కంటే.. దాన్ని రూ.5 లక్షల కింద ఐదు భాగాలు చేసి ఐదు బ్యాంకుల్లో ఎఫ్డీ (Fixed Deposit) చేస్తే మేలని నిపుణుల సూచన. ఫలితంగా ఏదైనా బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నా.. మిగిలిన మొత్తం భద్రంగా ఉంటుంది. అదే ఒకే బ్యాంకులో రూ.25 లక్షలు డిపాజిట్ చేస్తే.. తీరా ఆ బ్యాంకు దివాలా తీస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పీఎంసీ బ్యాంక్, యెస్ బ్యాంక్, కపోల్ బ్యాంకు విషయంలో డిపాజిటర్లు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కపోల్ కార్యకలాపాలపై ఇప్పటికీ మారటోరియం కొనసాగుతోంది. మరోవైపు డిపాజిట్ ఇన్సూరెన్స్ కింద ఒక్కో బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుంది. దీని ప్రయోజనం పొందాలంటే చిన్న చిన్న మొత్తాలను ఎఫ్డీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
రీఇన్వెస్ట్మెంట్ రిస్క్..
ఒకవేళ ఒకే బ్యాంకులో రూ.25 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. దాని గడువు ముగిసే సరికి వివిధ కారణాల వల్ల డిపాజిట్ రేట్లు దిగొచ్చాయనుకుందాం. అలాంటప్పుడు తిరిగి ఇన్వెస్ట్ చేయాలంటే ఆ తక్కువ రేటు వద్దే చేయాల్సి ఉంటుంది. కొంత కాలానికి మళ్లీ వడ్డీరేట్లు పెరిగితే ఆ ప్రయోజనాన్ని మిస్ అవుతాం. అలా కాకుండా.. పెద్ద మొత్తాన్ని కొన్ని భాగాలుగా విభజించి వివిధ కాలపరిమితులలో ఇన్వెస్ట్ చేయాలి. అలాంటప్పుడు ఒక ఎఫ్డీ (Fixed Deposit) కాలపరిమితి ముగిసినప్పుడు తక్కువ వడ్డీరేటు ఉన్నా.. మిగిలినవి మెచ్యూర్ అయ్యే సమయానికి పెరిగే అవకాశం ఉంటుంది. తిరిగి ఇన్వెస్ట్ చేసినప్పుడు పెరిగిన వడ్డీరేట్ల ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు.
అత్యవసర సమయాల్లో..
అత్యవసర పరిస్థితుల్లో ఒక్కోసారి ఎఫ్డీ (Fixed Deposit)ని బ్రేక్ చేయాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు పెద్ద మొత్తంలో చేసిన డిపాజిట్ను ఉపసంహరించుకుంటే.. పెనాల్టీ ఎక్కువే ఉంటుంది. పైగా మన అవసరం తీరిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఆ సమయంలో తక్కువ డిపాజిట్ రేట్లు నడుస్తుంటే.. ఆ రేటు వద్దే ఎఫ్డీ చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీకు రూ.2 లక్షలు అవసరమనుకుందాం. ఒకవేళ రూ.25 లక్షల ఎఫ్డీ (Fixed Deposit)ని బ్రేక్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పైగా మిగిలిన రూ.23 లక్షలను అప్పుడు ఎంత డిపాజిట్ రేట్ ఉంటే.. ఆ రేటు వద్దే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ రూ.5 లక్షల డిపాజిట్లు ఐదు ఉంటే.. దాంట్లో ఏదో ఒకదాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చినా.. పెద్దగా నష్టం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
Air India Express: తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అదేంటో చూద్దాం.. -
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం.. -
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత