Small savings scheme: చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీ యథాతథం
జులై-సెప్టెంబరు త్రైమాసికానికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదని జూన్30న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్లో పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: చిన్న మొత్తాల పొదుపుదారులకు శుభవార్త. ఈ సారి కూడా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. కరోనా నేపథ్యంలో 2021-22 రెండో త్రైమాసికానికి ఇంతకు ముందున్న వడ్డీ రేట్లే కొనసాగించాలని నిర్ణయించింది. వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించకుండా యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది ఐదోసారి.
పోస్టాఫీస్ పథకాలైన పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై)తో పాటు ఇతర పథకాల్లో జూన్ 30, 2021 వరకు చేరిన వారు ఎంత వడ్డీ రేటు పొందారో.. జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారు కూడా అదే వడ్డీ రేటును పొందుతారు. ఈ మేరకు జులై-సెప్టెంబరు త్రైమాసికానికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదంటూ జూన్ 30న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొంది. దీని ప్రకారం రెండో త్రైమాసికంలోనూ పబ్లిక్ ప్రావిండెండ్ ఫండ్ (పీపీఎఫ్) వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగానూ, జాతీయ పొదుపు పత్రాల (ఎన్ఎస్సీ) వార్షిక వడ్డీ రేటు 6.8 శాతంగానూ కొనసాగనుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టిన వారితో పోలిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఎక్కువ రాబడి పొందుతారు.
తాజా వడ్డీ రేట్లు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!