Indian economy: భారత వృద్ధిరేటు 7.3 శాతం.. ఎస్అండ్పీ అంచనా
ఈ ఆర్థిక సంవత్సరం భారతదేశ వృద్ధి రేటును ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 7.3 శాతంగా అంచనా వేసింది...
దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం భారతదేశ వృద్ధి రేటును ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 7.3 శాతంగా అంచనా వేసింది. వచ్చే ఏడాది ఇది 6.5 శాతంగా ఉంటుందని లెక్కగట్టింది. 2022 ఆఖరు వరకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యిత పరిధి అయిన ఆరు శాతం ఎగువనే ఉంటుందని తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే ఏడాది స్థానిక వినియోగం దన్నుగా నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ‘ఎకానమిక్ అవుట్లుక్ ఫర్ ఏషియా పసిఫిక్’ పేరిట నివేదికను విడుదల చేసింది.
అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన విషయం తెలిసిందే. ఫిచ్ రేటింగ్స్ 7.8 శాతం నుంచి 7 శాతానికి; ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 7 శాతం నుంచి 6.9 శాతానికి; ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7.5 శాతం నుంచి 7 శాతానికి కుదించాయి. గత ఏడాది భారత్ 8.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 7.2 శాతం చొప్పున వృద్ధి చెందనుందని ఆర్బీఐ ఆగస్టులో ప్రకటించిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా నమోదు కానుందని ఎస్అండ్పీ తెలిపింది. 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న వచ్చే ఆర్థిక సంవత్సరంలో ధరల పెరుగుదల 5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2022 ఆఖరు వరకు ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే ఉంటుందని తెలిపింది. గోధుమ, బియ్యంతో సహా ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడమే దీనికి దోహదం చేయనున్నట్లు పేర్కొంది. వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ ఆగస్టులో 7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. వరుసగా ఎనిమిదో నెలా ఆర్బీఐ గరిష్ఠ పరిమితి అయిన 6 శాతం ఎగువన నమోదైంది. మరోవైపు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 17వ నెల రెండంకెల్లో రికార్డయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో రూ.17,622 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. -
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్(Elon Musk) భారత్ పర్యటన మరింత ఆలస్యం కానుంది. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు