ప్రామాణిక గృహ బీమా పథకం భారత్ గృహ రక్ష
బీమా హామీలో 20 శాతం విలువైన వస్తువులకు కేటాయిస్తుంది
భారత బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక గృహ బీమా పాలసీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది, ఇది అగ్ని ప్రమాదాలకు, అనుబంధ ప్రమాదాలు జరిగినప్పుడు హామీనిస్తుంది.
మునుపటి ఆల్ ఇండియా ఫైర్ టారిఫ్ (ఏఐఎఫ్టీ) 2001 లో అందించిన స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్ (ఎస్ఎఫ్ఎస్పీ) పాలసీని ఈ క్రింది ప్రామాణిక ఉత్పత్తుల ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించిన ఐఆర్డీఏఐ జనవరి 4 న మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి సాదారణ బీమా సంస్థలు అగ్ని, సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు ఇకపై ఈ ప్రామాణిక బీమానే అందిస్తాయి.
'భారత్ గృహ రక్ష' విధానం వివరాలు :
అగ్ని, ప్రకృతి వైపరిత్యాలు ( తుఫాన్లు, హరికేన్, సుడిగాలి, సునామి, వరద, ఉప్పొంగడం, భూకంపం, ఉపద్రవం, కొండచరియలు), అడవి మంటలు, గొడవలు, అల్లర్లు, సమ్మెలు, ఉగ్రవాద చర్యలు, పేలుళ్లు, నీటి ట్యాంకులు, ఉపకరణాలు, లీకేజ్, దొంగతనం వంటి పైన పేర్కొన్న సంఘటనలు జరిగిన 7 రోజుల్లో హామీ లభిస్తుందని తెలిపింది.
గృహనిర్మాణానికి కవరేజీని అందించడంతో పాటు, పాలసీ బీమా చేసిన మొత్తంలో 20 శాతం గరిష్టంగా రూ.10 లక్షలకు లోబడి స్వయంచాలకంగా (వివరాల ప్రకటన అవసరం లేకుండా) కవర్ చేస్తుంది. వివరాలను ప్రకటించడం ద్వారా ముందుగా బీమా చేసినదాని కంటే అధిక మొత్తాన్ని కూడా ఎంచుకోవచ్చు.
పాలసీ రెండు ఆప్షన్లు కవర్లను అందిస్తుంది - ఒకటి ఆభరణాలు, వస్తువులు వంటి విలువైన వాటిపై బీమా, రెండవది పాలసీదారు, భాగస్వామీకి ఆ ప్రమాదంలో ఏదైనా జరిగితే హామీ లభించే ఆప్షన్ కూడా లభిస్తుంది. అయితే ప్రమాధానికి తగినంత బీమా హామీ పొందాలంటే సరైన వివరాలను అందించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, మీరు మీ సాధారణ ఇంటి విషయాలలో దేనినైనా (ఫ్రిజ్, టెలివిజన్, వాషింగ్ మెషీన్ వంటివి) రూ. 50,000 బీమా చేసినట్లయితే, అసలు విలువ రూ. 1 లక్ష అయినప్పటికీ మీకు రూ.50,000 బీమాను కంపెనీ చెల్లిస్తుంది. దీనికి విరుద్ధంగా, కొన్ని కంపెనీలు బీమా చేసిన దానిలో 50 శాతం అంటే రూ. 25,000 చెల్లిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం