NPS చందాదారులు ఫిర్యాదులు ఎలా నమోదు చేయాలి?
ఎన్పీఎస్ చందాదారులు వారి లాగిన్ ఐడి, పాస్వర్డ్ని ఉపయోగించి ఎన్పీఎస్ కింద ఏదైనా సంస్థపై ఫిర్యాదును నమోదు చేయవచ్చు
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ పింఛను పథకం (NPS) అనేది.. పెన్షన్తో కూడిన పెట్టుబడుల పథకం. ఇందులో టైర్-I, టైర్-II రెండు రకాల ఖాతాలుంటాయి. ఎన్పీఎస్లో చేరాలనుకునేవారు కచ్చితంగా టైర్- I ఖాతాలో చేరాలి. టైర్-II ఖాతాలో స్వచ్చందంగా మదుపు చేయొచ్చు. ఎన్పీఎస్లో రాబడులు మార్కెట్తో ముడిపడి ఉంటాయి. టైర్- II ఖాతాలో నిధులను ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. టైర్-I ఖాతా నిధుల ఉపసంహరణపై మాత్రం నిబంధనలు వర్తిస్తాయి. కాలానుగుణంగా నిబంధనల్లో మార్పులు చేస్తుంటారు. అందువల్ల ఎన్పీఎస్ గురించిన పూర్తి సమాచారం అందించేందుకు, ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎన్పీఎస్ మల్టీ లేయర్డ్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా చందాదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే, ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలియజేయవచ్చు.
ఫిర్యాదులను నమోదు చేయడానికి మార్గాలు..
చందాదారులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ద్వారా గానీ, రాతపూర్వకంగా సెంట్రల్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వద్ద గానీ, ఎన్పీఎస్ సీఆర్ఏ కాల్ సెంటర్కు కాల్ చేసి గానీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. చందాదారులు మాత్రమే కాకుండా చందాదారులు కాని వారు కూడా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.
ఆన్లైన్ ద్వారా..
- ఎన్పీఎస్ చందాదారులు తమ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగించి ఎన్పీఎస్ కింద ఏదైనా సంస్థపై ఫిర్యాదును నమోదు చేయొచ్చు. వెబ్సైట్లోని సబ్స్క్రైబర్స్ కార్నర్ కింద లాగ్ యువర్ గ్రీవెన్స్/ఎంక్వైరీ విభాగాన్ని సందర్శించడం మరొక మార్గం. ఫిర్యాదు విజయవంతంగా నమోదు చేసిన తర్వాత టోకెన్ నంబర్ జారీ చేస్తారు.
- ఎన్పీఎస్ చందాదారులు నేరుగా ఇక్కడ ఇచ్చిన లింకును క్లిక్ చేయడం ద్వారా ఈ-ఎన్పీఎస్ కి లాగిన్ అవ్వచ్చు.
- ఆన్లైన్లో సమాచారం కోసం లేదా ఫిర్యాదులు ఫైల్ చేసేందుకు..హోమ్ పేజీ కింది భాగంలో 'పోస్ట్ యువర్ క్వెరీస్/గ్రీవెన్స్ - క్లిక్ హియర్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీకు ఏ విధంగా సహాయపడగలం (HOW CAN WE HELP YOU) అనే పేజీ తెరుచుకుంటుంది. ఇక్కడ మీకు కొంత సమాచారం లభిస్తుంది. మీ సందేహాలకు సమాధానం ఇక్కడ లభిస్తే.. ఇక్కడితో ఆపివేయవచ్చు. లేదంటే.. ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసి ముందుకు వెళ్లవచ్చు.
- ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ వద్ద ప్రాన్ వివరాలు అందుబాటులో లేకపోతే మొదటి ఆప్షన్, అందుబాటులో ఉంటే రెండో ఆప్షన్ ఎంచుకోవాలి. ఒకవేళ ఇప్పటికే మీరు ఫిర్యాదు రిజిస్టర్ చేసివుంటే దాని స్టేటస్ ఇక్కడ తెలుసుకోవచ్చు.
- ఒకవేళ మీ వద్ద ప్రాన్ వివరాలు అందుబాటులో ఉంటే.. రెండో ఆప్షన్ ఎంచుకుని, ప్రాన్, క్యాప్చా ఎంటర్ చేసి, నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఫిర్యాదుల ఫారం ఓపెన్ అవుతుంది.
- ఒకవేళ మీ వద్ద ప్రాన్ అందుబాటులో లేకపోతే మొదటి ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ మీరు ఎన్పీఎస్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారా? లేదా సెలక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్పీఎస్ రిజిస్టర్ అయ్యి కూడా ప్రాన్ వివరాలు అందుబాటులో లేకపోతే.. PAO/POP-SP/CBO Reg No ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఫిర్యాదుల ఫారం ఓపెన్ అవుతుంది.
- ఒకవేళ మీరు ఎన్పీఎస్ చందాదారుడు కాకపోతే.. మీకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన దాన్ని ఎంచుకుని, క్యాప్చాను ఎంటర్ చేసి, నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఫిర్యాదుల ఫారం ఓపెన్ అవుతుంది.
- ఫిర్యాదుల ఫారంలో మీ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇచ్చి మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయొచ్చు.
కాల్ సెంటర్ లేదా ఐవీఆర్ సిస్టమ్..
చందాదారులు NSDL CRA కాల్ సెంటర్ 1800 222 080 నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఇక్కడ చందాదారులు T-pinని ఉపయోగించి ప్రమాణీకరించాలి. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, భవిష్యత్ రిఫరెన్స్ కోసం టోకెన్ నంబరు జారీ చేస్తారు.
ఫారం ఉపయోగించి..
ఎన్పీఎస్ చందాదారులు POP-SPకి రాతపూర్వకంగా కూడా ఫిర్యాదును సమర్పించవచ్చు. అథెంటికేషన్ కోసం చందాదారులు తమ ప్రాన్ నంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఫారం సమర్పించిన తర్వాత రసీదు ఇస్తారు. తర్వాత టోకెన్ నంబర్ను చందాదారునికి ఈ-మెయిల్ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి -
పన్ను ప్రణాళికకు తరుణమిదే..
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాత పన్నువిధానంలోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న వారు -
రెస్టరంట్లో డబ్బు ఆదా చేయడానికి చిట్కాలు
ఎప్పుడైనా కుటుంబంతో కలిసి రెస్టరంట్కు వెళ్లాలనుకునేవారు బిల్లుపై తగ్గింపు పొందాలనుకుంటారు. అలాంటి వారికోసమే కొన్ని చిట్కాలు. -
ఆన్లైన్ vs ఆఫ్లైన్ బీమా.. ఏది మెరుగైనది?
ప్రస్తుతం అన్ని రకాల బీమా పాలసీలు ఆన్లైన్, ఆఫ్లైన్లో లభిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాయి? ఎలా మెరుగైనవి అనేది ఇక్కడ తెలుసుకోండి. -
ఎన్పీఎస్ లాగిన్, క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న మార్పులివీ..
Changes from april 1st: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో చూసేయండి..
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM