Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) చివరకు 316.31 పాయింట్ల నష్టంతో 65,512.10 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) చివరకు 109.55 పాయింట్ల నష్టపోయి 19,528.75 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఈవారంలో కీలక వడ్డీరేట్ల పెంపుపై ఆర్బీఐ ప్రకటన చేయనుంది. మదుపర్లు దీనిపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే ద్రవ్యోల్బణం, వృద్ధి రేటుపై కేంద్ర బ్యాంకు వ్యాఖ్యలనూ మదుపర్లు నిశితంగా పరిశీలించనున్నారు. మరోవైపు అధిక చమురు ధరలు, ఎఫ్ఐఐల అమ్మకాలు, రూపాయి బలహీనతలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.
ఉదయం సెన్సెక్స్ (Sensex) 65,813.42 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,344.59 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 316.31 పాయింట్ల నష్టంతో 65,512.10 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,622.40 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,479.65 దగ్గర దిగువ స్థాయికి చేరుకుంది. చివరకు 109.55 పాయింట్లు నష్టపోయి 19,528.75 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.20 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ (Sensex)30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం, ఐటీసీ, టాటా స్టీల్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వివిధ ప్రాజెక్టులకు రూ.15 వేల కోట్లు మంజూరు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. కొత్తగా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులకూ నిధులు అందిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ షేరు ఈరోజు రూ.251.75 దగ్గర ఫ్లాట్గా ముగిసింది.
☛ మార్పిడి రహిత డిబెంచర్ల జారీ ద్వారా రూ.150 కోట్లు సమీకరించినట్లు కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. కంపెనీ షేరు ఈరోజు 2.29 శాతం పెరిగి రూ.646 దగ్గర స్థిరపడింది.
☛ తమ అనుబంధ సంస్థల్లో ఒకదానికి ముంబయిలో ఓ భారీ వంతెన నిర్మాణ ప్రాజెక్టు లభించినట్లు ఎల్అండ్టీ తెలిపింది. కంపెనీ షేరు ఈరోజు 1.67 శాతం పెరిగి రూ.3,074 వద్ద నిలిచింది.
☛ ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తి 83 శాతం పెరిగినట్లు ఎన్టీపీసీ తెలిపింది. కంపెనీ షేరు ఈరోజు 1.65 శాతం నష్టపోయి రూ.241.50 దగ్గర ముగిసింది.
☛ ఎన్సీసీ లిమిటెడ్కు రూ.4,206 కోట్లు విలువ చేసే మూడు ఆర్డర్లు లభించాయి. కంపెనీ షేరు ఈరోజు 3.77 శాతం పుంజుకొని రూ.160.90 దగ్గర స్థిరపడింది.
☛ ఆభరణ విక్రయశాలలు నిర్వహిస్తున్న వైభవ్ జెమ్స్ అండ్ జువెలర్స్ షేర్లు ఈరోజు తొలిసారి మార్కెట్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే రూ.215 వద్ద ఫ్లాట్గా ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఇంట్రాడేలో రూ.222 దగ్గర గరిష్ఠానికి చేరాయి. చివరకు 0.23 శాతం లాభంతో రూ.215.50 దగ్గర నిలిచాయి.
☛ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా షేర్లు సైతం ఈరోజే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.119తో పోలిస్తే 22 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. తర్వాత 32 శాతం పెరిగి రూ.157 దగ్గర అప్పర్ సర్క్యూట్ని తాకింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
Tata group- iphone: టాటా గ్రూప్ మరో అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి లభించనుంది. -
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
UPI payments: ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెల్లడించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. మరోవైపు యూపీఐ, ఆటో డెబిట్ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Year End Sale: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ తేదీలను ప్రకటించింది. పెద్ద ఎత్తున క్యాష్బ్యాక్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ సేల్ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. -
India Shelter Finance IPO: 13న ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493
India Shelter Finance IPO: రూ.1,200 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభం కానుంది. -
Onion Exports: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..
Onion Exports: దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు వీటి ఎగుమతులపై నిషేధం విధించింది. -
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
RBI: ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. -
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell | ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 69,716 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 20,967 దగ్గర ట్రేడవుతోంది. -
ఐటీ సెజ్ల్లో స్థలాలకు గిరాకీ
ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్ హోదాను రద్దు చేసే అధికారం అంతర్ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
సంస్థల్లో నియామకాలు 12% తగ్గాయ్
వేర్వేరు రంగాల కార్యాలయాల్లో నైపుణ్యంతో కూడిన (వైట్-కాలర్) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్స్పీక్ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా, ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది. -
2025కు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు: ఇక్రా
దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి 170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ - కార్పొరేట్ రేటింగ్స్ వి.విక్రమ్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది. -
ఏడు రోజుల జోరుకు విరామం
సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. -
వివో కేసులో తొలి ఛార్జిషీట్ దాఖలు
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, తొలి ఛార్జిషీట్ను ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది. -
దూసుకెళ్తున్న ఈవీలు
విద్యుత్ వాహనాల (ఈవీల) అమ్మకాలు రాణిస్తున్నాయి. విద్యుత్తు విభాగంలో ప్రయాణికులు- వాణిజ్య వాహనాలు కలిపి నవంబరులో 1,52,606 యూనిట్లు అమ్ముడైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం వెల్లడించింది. -
1 నుంచి హ్యుందాయ్ ధరల పెంపు
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎమ్ఐఎల్), జనవరి 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ముడి పదార్థాల ధరలు, ప్రతికూల మారకపు రేటు, అధిక కమొడిటీ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
స్టార్బక్స్కు రూ.91,500 కోట్ల నష్టం
సియాటెల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్బక్స్ కార్పొరేషన్ ఆదాయంపై, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం వేగంగా కనిపించింది. విక్రయాలు తగ్గడంతో, సుమారు 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91,500 కోట్ల) మేర విలువను కంపెనీ నష్టపోయింది. -
పంచదార ధరల అదుపునకు చర్యలు
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా నిషేధం విధిస్తూ, చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు, ధరలు అదుపులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటా విక్రయం
ఐడీఎఫ్సీ బ్యాంక్లో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటాను రూ.790.18 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ విక్రయం జరిగింది. ఈ వార్తలతో బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.02 శాతం నష్టపోయి రూ.87.69 వద్ద ముగిసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
భారత్ 8% వృద్ధి సాధిస్తుంది
మన ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెర్రీ పేర్కొన్నారు. కార్మిక శక్తి బలంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ పరంగా సంస్థాగత అనుభవం ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర భారతదేశం అంతగా రాణించడం లేదని, సార్వభౌమ వ్యవస్థలో ఇది ఉద్రిక్తతలను సృష్టించొచ్చని అన్నారు. -
సంక్షిప్త వార్తలు
ఇటీవలి కొద్ది నెలలుగా భారత అంకురాల్లో జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ తన వాటాలుతగ్గించుకుంటూ వస్తోంది. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే జొమాటోలో కూడా రూ.1,125.5 కోట్ల (135 మిలియన్ డాలర్ల) విలువైన షేర్లను సాఫ్ట్బ్యాంక్ విక్రయించనుందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
David Warner: మిచెల్కు కౌంటర్.. నా తల్లిదండ్రుల గొప్ప పెంపకంలో ఎదిగా: వార్నర్
-
Supreme Court: నేను రాజ్యాంగ సేవకుడిని : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
Mahua Moitra: మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు
-
Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
-
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
-
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు