Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 19,700 ఎగువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 173.22 పాయింట్ల లాభంతో 66,118.69 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 51.75 పాయింట్ల లాభపడి 19,716.45 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలకు ఇంట్రాడే కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల అండ లభించింది. దీంతో మధ్యాహ్నం తర్వాత సూచీలు లాభాల్లోకి ఎగబాకి ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మూలంగా సూచీలు ఉదయం నష్టాలు చవిచూశాయి.
ఉదయం సెన్సెక్స్ (Sensex) 65,925.64 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,549.96 వద్ద కనిష్ఠాన్ని, 66,172.27 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 173.22 పాయింట్ల లాభంతో 66,118.69 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,637.05 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,730.70- 19,554.00 మధ్య కదలాడింది. చివరకు 51.75 పాయింట్ల లాభపడి 19,716.45 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఎల్అండ్టీ, ఐటీసీ, సన్ఫార్మా, మారుతీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్టెల్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టైటన్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి అహ్లూవాలియా కాంట్రాక్ట్స్కు రూ.832.40 కోట్లు విలువ చేసే ఆర్డర్ లభించింది. అహ్లూవాలియా షేరు ఈరోజు ఒకశాతానికి పైగా పెరిగింది. చివరకు 0.32 శాతం లాభంతో రూ.723 దగ్గర స్థిరపడింది.
☛ పీఎన్బీ షేరు ఈరోజు ఇంట్రాడేలో నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్లకు చేరువైంది. చివరకు షేరు విలువ 2.46 శాతం లాభంతో రూ.81.30 దగ్గర ముగిసింది.
☛ కనీసం 25 శాతం సీఏజీఆర్ చొప్పున వృద్ధి రేటు సాధించాలని గ్రావిటా ఇండియా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు ‘విజన్ 2027’ పేరిట ప్రణాళికను విడుదల చేసింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 13.65 శాతం వృద్ధితో రూ.918.55 దగ్గర స్థిరపడింది.
☛ సాయి సిల్క్స్ లిమిటెడ్ (కళామందిర్) షేర్లు ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.222తో పోలిస్తే 4 శాతం లాభంతో నమోదయ్యాయి. చివరకు 10.32 శాతం లాభంతో రూ.244.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.247 దగ్గర గరిష్ఠాన్ని నమోదు చేసింది.
☛ సిగ్నేచర్ గ్లోబల్ షేర్లు సైతం ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.385తో పోలిస్తే 16 శాతం లాభంతో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. చివరకు 19.10 శాతం పెరిగి రూ.458.55 దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో రూ.474 దగ్గర గరిష్ఠాన్ని నమోదు చేసింది.
☛ ఈరోజు వాలియంట్ ల్యాబ్స్ ఐపీఓ ప్రారంభమైంది. ధరల శ్రేణి రూ.133- 140. రూ.152.46 కోట్ల సమీకరణ లక్ష్యంతో కంపెనీ ఐపీఓకి వచ్చింది. కనీసం 105 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలని నిబంధన విధించారు. ఈ లెక్కన మదుపర్లు రూ.13,965 కనీసం పెట్టుబడిగా పెట్టాలి. తొలిరోజు రిటైల్ విభాగంలో 0.55 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
Instagram: ఫేస్బుక్, ఇన్స్టా మధ్య అనుసంధానానికి వీలు కల్పించిన క్రాస్ చాటింగ్ ఫీచర్ను తొలగించనున్నట్లు మెటా వెల్లడించింది. -
OnePlus 12: స్నాప్డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్తో వన్ప్లస్ 12.. ఇండియాలో ఎప్పుడంటే?
OnePlus 12: వన్ప్లస్ 12 ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల కానుంది. -
Nirmala Sitharaman: వరుసగా ఐదోసారి.. ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో నిర్మలా సీతారామన్
ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వరుసగా ఐదో సారి చోటు లభించింది. -
ZestMoney: బీఎన్పీఎల్ స్టార్టప్ జెస్ట్మనీ మూత.. 150 మంది ఉద్యోగుల తొలగింపు
ZestMoney: జెస్ట్మనీ కొనుగోలు ప్రతిపాదనను ఫోన్పే విరమించుకోవడంతో కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాజీనామా చేశారు. అప్పటి నుంచి సంస్థలో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. -
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 పైన నిఫ్టీ
Stock Market Opening bell | ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 217 పాయింట్లు పెరిగి 69,513 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 20,936 వద్ద ట్రేడవుతోంది. -
Rapido: క్యాబ్ సేవల విభాగంలోకి ర్యాపిడో
రైడ్ సేవలు అందించే ర్యాపిడో, క్యాబ్ సేవల విభాగంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీపడనుంది. -
Gold: తనఖా బంగారం పోతే బ్యాంకుదే బాధ్యత
ఆర్థిక అవసరాలు వస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, నగదు అప్పు తెచ్చుకోవడం సులభమైన మార్గం. -
టెక్ ప్రపంచానికి హైదరాబాదీ ఉత్పత్తులు
ఇంటర్నెట్ కూడా సరిగా లేని రోజుల్లో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్, మనదేశంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం నిజంగా సాహసమే. అప్పటికి, వేరే ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఉత్పత్తి ప్రక్రియను అమెరికాలోని ప్రధాన కార్యాలయంతో ఎలా అనుసంధానించాలనే విషయంపైనా స్పష్టత లేదు. -
ఈడీ చర్యలతో ప్రభుత్వ బ్యాంకులకు రూ.15,183 కోట్లు వెనక్కి
మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన రూ.15,186.64 కోట్లలో దాదాపు అంతా ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెనక్కి ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. -
21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు గుర్తించాం
జీఎస్టీ అధికారులు రెండు నెలల పాటు (ఈ ఏడది మే 16 నుంచి జులై 15 వరకు) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు గుర్తించారని, రూ.24,000 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లుగా తేల్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
69,000 శిఖరంపై సెన్సెక్స్
వరుసగా ఆరో రోజూ లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ కొత్త గరిష్ఠాలకు చేరాయి. విద్యుత్, బ్యాంకింగ్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 69,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
2030కి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
భారత్ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. 2023-24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. -
ఏఏఏఐ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ మళ్లీ ఎన్నిక
2023-24 ఏడాదికి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్ ఎం మీడియా (ఇండియా) ప్రై.లి. దక్షిణాసియా సీఈఓ ప్రశాంత్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. -
అదానీ గ్రూపు చేతికి సంఘీ ఇండస్ట్రీస్
సంఘీ ఇండస్ట్రీస్ను గౌతమ్ అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ స్వాధీనం చేసుకుంది. ఒక్కో షేరుకు రూ.121.90 చొప్పున చెల్లించి, ఈ లావాదేవీని పూర్తి చేసింది. -
వినియోగ బైక్ల వ్యాపారంలోకి రాయల్ ఎన్ఫీల్డ్
మోటార్సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా వినియోగ (ప్రీ-ఓన్డ్) బైక్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘రీఓన్’ పేరుతో ఈ వ్యాపారాన్ని నిర్వహించనుంది. -
ఎన్ఎస్ఈ నుంచి మరో కొత్త సూచీ
ఎన్ఎస్ఈకి చెందిన సూచీల సేవల అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్.. నిఫ్టీ 50 సూచీలో కొత్త రకం సూచీని తీసుకొచ్చింది. ‘నిఫ్టీ 50 నెట్ టోటల్ రిటర్న్ సూచీ’గా దీనిని వ్యవహరిస్తారు. -
యూకో బ్యాంక్ ఖాతాదారుల్లో డబ్బుల జమ కేసులో సీబీఐ తనిఖీలు
యూకో బ్యాంకుకు చెందిన 41,000 మంది ఖాతాదార్ల ఖాతాల్లోకి మొత్తంగా రూ.820 కోట్లు జమ అయిన వ్యవహారంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. -
సంక్షిప్త వార్తలు(7)
గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే సంస్థ గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గోడి ఇండియా అనే సంస్థలో 31% వాటా కొనుగోలు చేస్తోంది. -
Steve Jobs: స్టీవ్ జాబ్స్ సంతకం.. రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు..!
Steve Jobs: యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన 47 ఏళ్ల నాటి చెక్కు రూ.20లక్షలకు పైగా అమ్ముడుపోయే అవకాశం ఉందని ‘ఆర్ఆర్ ఆక్షన్స్’ సంస్థ వెల్లడించింది.


తాజా వార్తలు (Latest News)
-
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
-
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం
-
Raja Singh: కాంగ్రెస్వి మోసపూరిత హామీలు: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్
-
Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్
-
నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ బృందం
-
Pakistan: పాక్లో ఆగని ఉగ్రవాదుల హత్యలు.. హఫీజ్ సయీద్ అనుచరుడి కాల్చివేత